Miss World Pageant: 28 ఏళ్ల తర్వాత భారత్ "మిస్ వరల్డ్" పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీకలు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ‘‘మిస్ వరల్డ్కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. #మిస్ వరల్డ్ ఇండియా #బ్యూటీ విత్ పర్పస్’’ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో…
SpiceJet Flight: స్పైస్జెట్ ఎయిర్లైన్స్కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు గంటన్నర పాటు టాయిలెట్లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో టాయిలెట్ గేటు తెరుచుకోకపోవడంతో ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు.
Dead Rat In Food: ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే దాన్ని క్షుణ్ణంగా గమనించిన తర్వాతే తినండి. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం తిని ఓ వ్యక్తి ఆస్పత్రి పాలైన సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. ప్రయాగ్ రాజ్కి చెందిన 35 ఏళ్ల లాయర్ రాజీవ్ శుక్లా, ముంబైకి వెళ్లిన సందర్భంలో జనవరి 8న బార్బెక్యూ నేషన్ రెస్టారెంట్ నుంచి క్లాసిక్ వెజ్ మీల్ బాక్స్ ఆర్డర్ చేశాడు.
ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన ఆంక్షలను ఓ ఆటో డ్రైవర్ బ్రేక్ చేశాడు. 21.8 కిలో మీటర్ల దూరం ఉన్న ఈ బ్రిడ్జ్ పై ఓ ఆటో ప్రయాణం చేస్తూ కనిపించింది. నిజానికి మూడు చక్రాల వెహికిల్స్ కు ఈ బ్రిడ్జ్ మీదకు అనుమతి లేదు.. కానీ ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్పై ఆటో తిరుగుతున్నట్లు ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమిత్ షా అక్క రాజుబెన్ సోమవారం ముంబైలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలల క్రితం ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆమెకు లంగ్స్ మార్పిడి జరిగింది. ఈ సర్జరీ తర్వాత ఆమె కోలుకునే దశలో ఉన్నారు. ఈలోపే ఆమె ఆరోగ్యం క్షీణించి మరణించారు.
Atal Setu: దేశంలో అతిపెద్ద సముద్ర వంతెన ‘అటల్ సేతు’ని ప్రధాని రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్(MTHL)గా పిలువబడుతున్న ఈ వంతెను ముంబై వాసులకు దూరాభారాన్ని తగ్గిస్తుంది. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లాలోని నవా శేవాను కలుపుతూ ఈ వంతెనను నిర్మించారు.
Travel Company: బస్సు ప్రయాణంలో తనను గమ్యస్థానానికి చేర్చకుండా ఇబ్బందులకు గురి చేసిన ట్రావెల్ కంపెనీకి రూ. 2 లక్షల జరిమానా విధించారు. బాధితుడైన ముంబై వాసికి టికెట్ డబ్బులతో పాటు రూ. 2 లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు చెప్పింది. ట్రావెల్ పోర్టర్, బస్ సర్వీస్ రూట్ మార్పు గురించి ఫిర్యాదుదారుడికి ముందుగానే తెలియజేయాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని వినియోగదారుల కమిషన్ పేర్కొంది. టిక్కెట్ ధర రూ. 745తో పాటు 2 లక్షలు 69…
IndiGo Flight: ముంబై నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జిపై గంటల తరబడి నిలిచిపోయింది. దీంతో ముంబై విమానాశ్రయంలో గందరగోళ వాతావరణం నెలకొంది.
Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్కి చెందిన ఫామ్ హౌజ్ లోకి ఇద్దరు అపరిచిత వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పోలీసుల వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ముంబై సమీపంలోని పన్వేల్లోని సల్మాన్ ఖాన్ ఫామ్హౌజ్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. జనవరి 4న ఈ ఘటన జరిగింది. నిందితులను అజేష్ కుమార్ ఓంప్రకాష్ గిల్, గురుసేవక్ సింగ్ తేజ్సింగ్ సిఖ్లు గుర్తించారు.