Sniffer Dog: ప్రస్తుతం ఆర్మీతో పాటు ఇతర భద్రతా బలగాల్లో జాగిలాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారానే చాలా వరకు ఆపరేషన్లను మన భద్రతా బలగాలు విజయవంతంగా పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేటకు స్నిఫర్ డాగ్స్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ముంబైలో తప్పిపోయిన పిల్లాడిని కేవలం 3 గంటల్లోనే కనుగొంది. "లియో" పేరు కలిగిన స్నిఫర్ డాగ్ అతడిని గుర్తించింది.
ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని ఫోన్ కాల్ రావడంతో షాక్కు గురి అయ్యారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు ఏక్తా నగర్లో తలదాచుకున్నారని అతడు ఫోన్లో పోలీసులకు తెలిపారు.
82 Year Old Sharad Pawar delivers speech amid rains in Mumbai: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వ్యవస్థాపకుడు శరద్ పవార్.. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆదివారం నవీ ముంబైలో ఏర్పాటు చేసిన ఎన్సీపీ పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా వర్షం కురిసింది. శరద్ పవార్కు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 82 ఏళ్ల శరద్ పవార్ వర్షంలో తడుస్తూ ప్రసంగించడంపై అందరూ హర్షం…
ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా మత్తులో మునిగి తేలుతున్నారు.. డ్రగ్స్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అడ్డువచ్చిన వారి అడ్డును తొలగిస్తున్నారు.. తాజాగా మరో దారుణం వెలుగు చూసింది.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని అంధేరీ ఏరియాకు చెందిన షబ్బీర్ ఖాన్, అతడి భార్య సానియా డ్రగ్స్కు అలవాటుపడ్డారు.. వారు అలా మత్తు కోసం మనుషులు అనే సంగతి కూడా మర్చిపోయారు.. డ్రగ్స్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే అమ్ముకున్నారు.. ఎంత దారుణం.. అసలు విషయానికొస్తే.. తమ రెండేళ్ల కుమారుడితో…
ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని బాంబుతో పేల్చివేస్తామని బెదిరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుల గురించి ఆరా తీస్తున్నారు.
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న హైదరాబాద్ వదిలి ముంబైకి మకాం మార్చిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి ఆమె ముంబైకి షిఫ్ట్ అవ్వడంతో అంతా ఆలోచనలో పడ్డారు. సౌత్లో వరుసగా సినిమాలు చేస్తున్న ఆమె సడెన్గా ముంబై వెళ్లడానికి కారణం ఏమై ఉంటుందా? అని ఎవరికి తోచినట్టు వారు ఊహించుకుంటున్నారు. ఈ అంశంపై ఎన్నో గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాను ముంబై వెళ్లడానికి కారణం ఎంటో స్వయంగా చెప్పింది మంచు లక్ష్మి. Also Read: Game…
ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా ముంబై లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ముంబైలోని 24 అంతస్తుల నివాస భవనంలో గురువారం మంటలు చెలరేగాయి, కనీసం 135 మందిని అక్కడి నుండి సురక్షితంగా రక్షించినట్లు పౌర అధికారులు తెలిపారు.. వివరాల్లోకి వెళితే.. ఘోడాప్డియో ప్రాంతంలోని MHADA కాలనీలోని న్యూ హింద్ మిల్ కాంపౌండ్లో ఉన్న భవనం యొక్క మూడవ అంతస్తులో తెల్లవారుజామున 3:40 గంటలకు మంటలు చెలరేగాయని, ఇక్కడ…
26/11 Mumbai Attacks: 26/11 ముంబై దాడులకు ఈ నెలతో 15 ఏళ్లు కావస్తోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ ‘లష్కరే తోయిబా’ ఉగ్రవాదులు ముంబై నగరంపై దారుణమైన దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే లష్కరే తోయిబాను ఇజ్రాయిల్ ఈ రోజు ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. దీనిని ఘోరమైన ఖండించదగిన సంస్థగా పేర్కొంది. భారతదేశం నుంచి ఎలాంటి అభ్యర్థన లేనప్పటికీ ఇజ్రాయిల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్లను చంపుతానంటూ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ పేరుతో ఆ వ్యక్తి ముంబై పోలీసు కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సిగ్నల్ ద్వారా అతడిని ట్రేస్ చేసిన అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ విషయం బయట పెట్టాడు. పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్లను…
Mumbai: స్నేహితుడే కదా అని నమ్మి వచ్చినందుకు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనే కాకుండా అతని స్నేహితుడు కూడా రేప్ చేశాడు. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) క్వార్టర్స్లో నివసించే 19 ఏళ్ల యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారం చేసినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు.