Air India: ప్రయాణికుడి మృతికి కారణమైన ఎయిరిండియాకు భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఎయిర్పోర్టులో ( Mumbai) ప్రయాణికుడి మృతికి కారణమైన కేసులో ఎయిరిండియాకు (Air India) భారీ షాక్ తగిలింది. రూ.30లక్షలు జరిమానా విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆప్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) గురువారం ఆ విమానయాన సంస్థపై చర్యలు తీసుకుంది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం దిగిన తర్వాత 80 ఏళ్ల ప్రయాణికుడికి వీల్చైర్ (Wheelchair Dies) ఏర్పాటు చేయకపోవడంతో.. అతడు తన భార్య సహాయంతో టెర్మినల్కు నడుచుకుంటూ వచ్చేశాడు. దీంతో ఆయాసం రావడంతో అక్కడినే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచారు. ఈ ఘటన ఫిబ్రవరి 16న జరిగింది.
Also Read
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
- H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
- England Team: 23 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్.. 20 వికెట్లు వారి ఖాతాలోనే..
దీన్ని సీరియస్గా తీసుకున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఎయిరిండియా సమాధానం తర్వాత డీజీసీఏ దోషిగా నిర్ధారించి రూ.30 లక్షల ఫైన్ విధించింది.
వివరణ..
ఇదిలా ఉంటే ప్రయాణికుడి భార్యకు వీల్చైర్ అందించామని, మరొకటి ఏర్పాటు చేసే వరకు వేచి ఉండమని సిబ్బంది కోరారని ఎయిర్లైన్ తెలిపింది. కానీ అంతలోనే అతను తన భార్య సహాయంతో టెర్మినల్కు వెళ్లిపోయారని ఎయిరిండియా పేర్కొంది. వీల్చైర్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్లే వేచి ఉండమని చెప్పినట్లు పేర్కొంది.
కానీ ఎయిరిండియా వివరణను డీజీసీఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఎయిర్క్రాఫ్ట్ రూల్స్కు ఇది విరుద్ధమని.. నిబంధనలకు కట్టుబడి ఉండడంలో వైఫల్యం కారణంగా ఎయిర్లైన్స్కు భారీ జరిమానా విధించింది.
తాజావార్తలు
-
Gachibowli Bike Accident: గచ్చిబౌలిలో ఘోరం.. బైక్ ప్రమాదంలో ఐటీ ఉద్యోగి మృతి..
-
Irumudi Day 1 Collections: థియేటర్లలో రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్ సునామీ.. ఓటీటీ రిలీజ్పై అదిరిపోయే అప్డేట్!
-
Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్ల ముప్పు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 31 నుంచే ప్రారంభం..
-
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ టెన్షన్.. గతేడాదితో పోల్చితే 8 రెట్లు పెరిగిన కేసులు..
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?