పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరుగుతోంది. ఈ మూవీలో టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ గణేష్ నృత్యరీతులు సమకూర్చారు. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్లో డ్యాన్స్ చేసి పవర్స్టార్ అభిమానులను గణేష్ మాస్టర్ మెస్మరైజ్ చేశాడు. అనంతరం గణేష్ మాస్టర్ మాట్లాడుతూ.. భీమ్లా నాయక్ సినిమాలో ఓ స్పెషల్ ఉందని సీక్రెట్ రివీల్…
కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్ లో ఏ మాత్రం కొత్తదనం ఉన్నా నటీనటుల గురించిన ఆలోచన చేయకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే నూతన నటీనటులు వైవిధ్యమైన కథాంశాలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నారు. అలాంటి చిత్రమే ‘కిరోసిన్’. గతంలో తెరపై రాని ఓ సరికొత్త క్రైమ్ థిల్లర్ కథను తయారు చేసుకున్న ధృవ తానే స్క్రీన్ ప్లే, మాటలు రాసుకుని ప్రధాన పాత్రనూ ఇందులో పోషించారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్…
హైదరాబాద్లో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సినిమాలో పాట పాడిన మొగులయ్యకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ నేపథ్యంలో మొగులయ్యను వేదికపై చిత్ర యూనిట్ సన్మానించింది. భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మొగులయ్య మాట్లాడుతూ.. భీమ్లానాయక్ సినిమాలో తాను పాట పాడటం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ సినిమాలో తాను పాట పాడకపోతే తానెవరో ఎవరికీ తెలిసేది…
దర్శకుడు రామ్గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రెండింగ్లో ఉన్న విషయాలపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా గురించి సోషల్ మీడియా హీటెక్కిపోతోంది. ఒకవైపు ట్రైలర్, మరోవైపు ప్రి రిలీజ్ ఈవెంట్ గురించి తెగ చర్చ నడుస్తోంది. దీంతో భీమ్లానాయక్ ట్రైలర్పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత…
విజయ్దేవరకొండ, రష్మిక జంట త్వరలో వివాహం చేసుకుంటుందని బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. వీటిని ఆసరా చేసుకుని తెలుగు మీడియా కూడా ఈ ఏడాదిలోనే విజయ్, రష్మిక జోడీ పెళ్లి పీటలు ఎక్కబోతుందని వార్తలు వండి వారుస్తోంది. ఇటీవల రష్మిక తన ప్రియుడు రోహిత్ శెట్టితో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది. ఈ జోడీ చేసింది రెండు సినిమాలే అయితే వారి కెమిస్ట్రీ ఆన్స్కీన్ మీద చూడముచ్చటగా ఉంటుంది.…
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప మళ్లీ సీఎం కాబోతున్నారు. అయితే ఇది నిజంగా కాదండోయ్. కేవలం సినిమా వరకే పరిమితం. సినిమాల్లో పేరు తెచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చి చక్రం తిప్పిన చాలామందిని మనం చూశాం. కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరి ఇప్పుడు ముఖానికి రంగేసుకుంటున్నారు. తనూజ అనే సినిమాతో యడ్యూరప్ప తెరంగేట్రం చేస్తున్నారు. ఓ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో యడ్యూరప్ప సీఎంగా నటిస్తున్నారు. హరీష్…
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఎవరికీ తలవంచడు అనేది ఈ మూవీ ట్యాగ్ లైన్. ఈ సినిమా తెలుగు టీజర్ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ఈ సినిమాలో సూర్య డిఫరెంట్ షేడ్స్లో కనిపిస్తున్నాడు. చాలా కాలం తర్వాత మాస్ పాత్రలో అభిమానులను అలరిస్తాడని టీజర్ చూస్తే తెలిసిపోతుంది. నాతో ఉండేవేళ్ళెప్పుడూ భయపడకూడదు.. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు అంటూ సూర్య చెప్పే మాస్ డైలాగ్స్ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. సన్…
మంచు మోహన్బాబు కుటుంబసభ్యులపై కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఏపీలో సినిమా టిక్కెట్ ధరల అంశం, సన్నాఫ్ ఇండియా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్లు.. ఇలా ప్రతి అంశం సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకు చెందిన నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ తరఫున హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శేషు కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. మంచు ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ను తక్షణమే తొలగించకపోతే చర్యలు…
అభిరామ్.ఎం దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రను పోషిస్తున్న చిత్రం ‘డై హార్డ్ ఫ్యాన్’. సెలెబ్రిటీకీ – అభిమానికి మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ చిత్రకథాంశం. ఇందులో సెలబ్రిటీగా ప్రియాంక శర్మ నటిస్తుంటే, ఆమె అభిమాని పాత్రను శివ ఆలపాటి పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య సాగే డ్రామా ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్న షకలక శంకర్, రాజీవ్ కనకాల ఫస్ లుక్ పోస్టర్స్ ను చిత్ర బృందం…
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల తేదీని చిత్ర యూనిట్ అఫీషియల్గా ప్రకటించింది. ఈనెల 21న ట్రైలర్ను విడుదల చేయనున్నట్లు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా తెలిపింది. దీంతో శనివారం ట్రైలర్ విడుదల కావడం లేదని తేలిపోయింది. అటు ఈనెల 21న భీమ్లా నాయక్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున జరగబోతోంది. ఈ వేడుకకు మంత్రి కేటీఆర్తో పాటు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వస్తున్నట్లు చిత్ర…