Duvvada Srinivas: వైఎస్ జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా!
- వైఎస్ జగన్కు కలిసిన దువ్వాడ శ్రీనివాస్
- 'ఏం చేద్దాం శ్రీనివాస్?' అంటూ పలకరించిన జగన్
- తాడేపల్లి నివాసానికి రావాలని చెప్పిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పిలిచి మాట్లాడిన ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్కు దువ్వాడ ఎదురుపడ్డారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలో జగన్ను దువ్వాడ కలిశారు. దువ్వాడను చూసిన జగన్.. స్నేహపూర్వకంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అంటూ పలకరించారు. ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ అభ్యర్థించారు. సమగ్రంగా చర్చించేందుకు తాడేపల్లిలోని తన నివాసానికి రావాలని దువ్వాడను జగన్ ఆహ్వానించారు.
వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా సమావేశాల సమయంలో అసెంబ్లీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వస్తున్నారు. గతంలో ఆయనపై వచ్చిన వివాదాల నేపథ్యంలో ఏడు నెలల క్రితం వైసీపీ నుంచి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చే సమయంలో వైఎస్ జగన్ను దువ్వాడ కలిశారు. ప్రస్తుత పరిణామాలను జగన్కు వివరించే ప్రయత్నం చేయగా.. తర్వాత మాట్లాడదాం అంటూ మాజీ సీఎం వెళ్లిపోయారు. మండలిలో ప్రజా సమస్యలపై వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో దువ్వాడ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
Also Read: AP Assembly 2026: 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఫిబ్రవరి 14న బడ్జెట్!
త్వరలో వైఎస్ జగన్ను కలుస్తానని, వైసీపీలో అవకాశం ఇవ్వకుంటే సొంతగా పోటీ చేసి బలం చూపిస్తా అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మీడియాతో దువ్వాడ మాట్లాడుతూ… ‘మండలిలో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తా. వైఎస్ జగన్ను త్వరలోనే కలుస్తాను. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతాను. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదు. జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తాను’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!