Duvvada Srinivas: వైఎస్ జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తా!
- వైఎస్ జగన్కు కలిసిన దువ్వాడ శ్రీనివాస్
- 'ఏం చేద్దాం శ్రీనివాస్?' అంటూ పలకరించిన జగన్
- తాడేపల్లి నివాసానికి రావాలని చెప్పిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పిలిచి మాట్లాడిన ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ జగన్కు దువ్వాడ ఎదురుపడ్డారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చే సమయంలో జగన్ను దువ్వాడ కలిశారు. దువ్వాడను చూసిన జగన్.. స్నేహపూర్వకంగా ‘ఏం చేద్దాం శ్రీనివాస్?’ అంటూ పలకరించారు. ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని దువ్వాడ అభ్యర్థించారు. సమగ్రంగా చర్చించేందుకు తాడేపల్లిలోని తన నివాసానికి రావాలని దువ్వాడను జగన్ ఆహ్వానించారు.
వైసీపీ నుంచి సస్పెండ్ చేసినా సమావేశాల సమయంలో అసెంబ్లీకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వస్తున్నారు. గతంలో ఆయనపై వచ్చిన వివాదాల నేపథ్యంలో ఏడు నెలల క్రితం వైసీపీ నుంచి పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చే సమయంలో వైఎస్ జగన్ను దువ్వాడ కలిశారు. ప్రస్తుత పరిణామాలను జగన్కు వివరించే ప్రయత్నం చేయగా.. తర్వాత మాట్లాడదాం అంటూ మాజీ సీఎం వెళ్లిపోయారు. మండలిలో ప్రజా సమస్యలపై వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్లే ఆలోచనలో దువ్వాడ ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
Also Read: AP Assembly 2026: 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఫిబ్రవరి 14న బడ్జెట్!
త్వరలో వైఎస్ జగన్ను కలుస్తానని, వైసీపీలో అవకాశం ఇవ్వకుంటే సొంతగా పోటీ చేసి బలం చూపిస్తా అని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. మీడియాతో దువ్వాడ మాట్లాడుతూ… ‘మండలిలో ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తా. వైఎస్ జగన్ను త్వరలోనే కలుస్తాను. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుడి వైపు మాట్లాడతాను. మెడికల్ కాలేజీలని పీపీపీ విధానంలో నిర్మించాల్సిన అవసరం లేదు. జగన్ అవకాశం ఇవ్వకపోతే.. సొంతగా పోటీ చేసి నా బలం చూపిస్తాను’ అని చెప్పారు.
తాజావార్తలు
-
Varun Tej: చిరంజీవి కళ్ళల్లో ఆనందం చూడటమే నా ఏకైక లక్ష్యం
-
Nagababu: మాకు ప్రాణ వాయువు మా అన్నయ్య
-
Chiranjeevi: మంచి కంటెంట్ ఇస్తే థియేటర్లకి జనం ఖచ్చితంగా వస్తారు
-
Massive Accidents : NH-65పై మృత్యుఘోష.. ఒకే రోజు 9 మంది బలి.!
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..