45 ఏళ్ళ ‘భలే దొంగలు’
(అక్టోబర్ 29న ‘భలేదొంగలు’కు 45 ఏళ్ళు పూర్తి)
ఉత్తరాదిన విజయం సాధించిన చిత్రాల ఆధారంగా వందలాది దక్షిణాది సినిమాలు రూపొంది అలరించాయి. 1970లలో అనేక హిందీ చిత్రాలు తెలుగులో రీమేక్ అయి మురిపించాయి. టాప్ స్టార్స్ అందరూ హిందీ రీమేక్స్ పై మోజుపడ్డ రోజులవి. హిందీలో శశికపూర్, ముంతాజ్ జంటగా రూపొందిన ‘చోర్ మచాయే షోర్’ ఆధారంగా తెలుగులో కృష్ణ, మంజుల జోడీగా ‘భలే దొంగలు’ చిత్రం తెరకెక్కింది. కె.ఎస్.ఆర్. దాస్ దర్శకత్వంలో త్రిమూర్తి ప్రొడక్షన్స్ పతాకంపై జి.సాంబశివరావు, పి.బాజ్జీ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1976 అక్టోబర్ 29న విడుదలైన ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది.
‘భలేదొంగలు’ కథ విషయానికి వస్తే – కోర్టులో ఇంజనీర్ శేఖర్ ఎంత మొత్తుకున్నా, అతని వాదనలు ఎవరూ వినరు. రేఖ అనే ధనవంతుల అమ్మాయిని రేప్ చేయబోయాడనే నేరంపై అతను జైలుకు వెళతాడు. అక్కడ అతనికి రంగతో పాటు మరో ఇద్దరు దొంగలు పరిచయం అవుతారు. శేఖర్ గతం గుర్తు చేసుకుంటాడు. తాను ప్రేమించిన రేఖ కోటీశ్వరుని కూతురు కావడం వల్ల రాజు-పేద తేడాలు పొడసూపుతాయి. రేఖ తండ్రి మరో రాజకీయనాయకునితో కలసి శేఖర్ ను ఓ పథకం ప్రకారం జైలుకు పంపించి ఉంటాడు. జైలులో పరిచయమైన వారి ద్వారా జైలు నుండి తప్పించుకొంటాడు శేఖర్. రేఖను కలిశాక అన్ని విషయాలు తెలుసుకుంటాడు. తరువాత తన దొంగ మిత్రులతో, రేఖతోనూ కలసి ఓ ఊరు చేరుకుంటారు. ఓ జమీందార్ ఆ ఊరిని బాగు చేయించమని పంపినవారిగా గ్రామస్థులు భావించి, వీరిని గౌరవిస్తారు. వారు కూడా అదే చోటు మంచిదని అక్కడే ఉంటారు. ఆ ఊరిని పీడిస్తున్న దొంగలముఠాకు బుద్ధి చెబుతారు. ఆ ముఠాతో చేతులు కలిపి, రాజకీయనాయకుడు శేఖర్ ను అతని మిత్రులను అంతమొందించాలనుకుంటాడు. చివరకు శేఖర్, అతని మిత్రులు, గ్రామస్థులు ఎదురు తిరిగి విజయం సాధిస్తారు. రాజకీయనాయకుణ్ణి, దొంగలను అరెస్ట్ చేస్తారు. జైలు నుండి తప్పించుకు వచ్చినందుకు తమనూ అరెస్ట్ చేయమని శేఖర్ కోరతాడు. తిరిగి వస్తామని చెప్పి, వారు వెళ్తూండగా కథ ముగుస్తుంది.
Also Read
- Tamilanadu Elections Special : తమిళనాడు ఎన్నికలో ఎవరి బలం ఎంత.. అధికారం ఎవరిది.. గ్రౌండ్ రిపోర్ట్
- Music Directors Flops : వరుస ఫ్లాపుల్లో అగ్ర సంగీత దర్శకులు.. క్యాచీ ట్యూన్స్ కరువయ్యాయా?
- Tollywood February Box Office Report : ఫిబ్రవరిలో పరాజయాల పరంపర.. ఆదుకోని శ్రీ విష్ణు..
- Tollywood : 2026 టాలీవుడ్ జనవరి సినిమాల రిజల్ట్స్.. ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?
ఈ చిత్రంలో మోహన్ బాబు, నాగభూషణం, పద్మనాభం, ప్రభాకర్ రెడ్డి, మిక్కిలినేని, త్యాగరాజు, కేవీ చలం, మాడా, జయమాలిని ముఖ్యపాత్రధారులు. ఈ చిత్రానికి భమిడిపాటి రాధాకృష్ణమూర్తి మాటలు రాయగా, పాటలను కొసరాజు, ఆరుద్ర, దాశరథి, గోపి పలికించారు. సత్యం సంగీతం సమకూర్చారు. ఇందులో మోహన్ బాబు ఊతపదం ‘చిక్కర్ మే రక్కా’ అన్నది అప్పట్లో జనాన్ని భలేగా ఆకట్టుకుంది. “అందమైనా చిన్నవాడా…”, “వచ్చాడు చూడు వరసైన వాడు…”, “పండంటి చిన్నదిరా…”, “చూశానే ఓలమ్మీ చూశానే…”, “కండలు పిండి పనిచేస్తే కొండలు పిండై పోవునురా…” అంటూ సాగే పాటలు అలరించాయి. కృష్ణ రీమేక్ మూవీస్ లో సక్సెస్ ఫుల్ సినిమాగా ‘భలే దొంగలు’ నిలచింది.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!