MLC Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత.
RS Praveen Kumar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం మహిళా వైద్యుల బృందం ఇడి కేంద్ర కార్యాలయం పరివర్త్ భవన్కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
పార్టీ నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ విషయంలో ఏది పడితే అది మాట్లాడొద్దని సూచించారు. కవిత అరెస్ట్ తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించి కాదు... వ్యక్తిగతమైన ఇష్యూ అని పేర్కొన్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కవిత అరెస్ట్ గురించి ప్రెస్ మీట్ లు పెట్టొద్దని ఆదేశించారు.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అవినీతికి పాల్పడినందుకు ఆమె జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని... ఈ రోజు సోదరి వెళ్లింది... రేపు సోదరుడు వెళ్ళవచ్చు... ఎల్లుండి తండ్రి కూడా జైలుకు వెళ్లవచ్చునని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలను ఆయన ఓ వీడియో ద్వారా తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్లోని ఆమె నివాసంలో కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ దాడులు, అరెస్ట్ పై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కై ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు, అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది.. ఇన్ని రోజులు లేనిది పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ అరెస్టులు ఏంటి అని ఆమె ప్రశ్నించారు. చట్టానికి వ్యతిరేకంగా ఈడీ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరా ను ఈడీ విచారిస్తుంది. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా ఈడీకి ఇచ్చారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేసింది. కవితను రాత్రికి…
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. సాయంత్రం 5.20 గంటల సమయంలో కవితను అరెస్ట్ చేసినట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. సెక్షన్ 19, Pmla act కింద ఈడీ అరెస్ట్ చేశారు. కవిత నివాసం నుంచి మూడు వాహనాల్లో కవితను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు తరలించారు. దుర్గంచెరువు మీదుగా శంషాబాద్ కి ఈడీ తీసుకెళ్తున్నారు. అంతకుముందు కవిత ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తలకు, అభిమానులకు నినాదాలు చేశారు. ఇలాంటి అణిచివేతలు ఎన్ని…
కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో కవిత ఇంటికి కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. కనీసం తమ న్యాయవాదినైనా అనుమతించాలి కదా అని వాదించారు. అధికారులు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.