స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి చీఫ్ ఎలక్ర్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదిలాబాద్ 8 పోలింగ్ స్టేషన్లు మొత్తం 937 ఓటర్లు ఉన్నారన్నారు. ఆదిలాబాద్లో ఒక్కో స్థానానికి ఇద్దరూ అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. కరీంనగర్లో 8 పోలింగ్ స్టేషన్లు ఉండగా, 1324 ఓటర్లు ఉన్నారు. 2 ఎమ్మెల్సీ స్థానాలకు 10 మంది బరిలో ఉన్నట్టు తెలిపారు. మెదక్ 9 పోలింగ్…
రాష్ట్ర విభజన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు పదవులు వచ్చాయి కానీ.. పవర్ రాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..230 ఓట్లు మెదక్లో కాంగ్రెస్కు ఉన్నాయన్నారు. గెలిచే ఓట్లు లేకున్నా నా భార్యను పోటీలో నిలబెట్టానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడం వల్లనే ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో హరీష్ రావు మాట్లాడుతున్నారు. మరి రెండు ఏళ్ల నుంచి ఎందుకు మాట్లాడలేదని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్లో ఒక్కో నియోజకవర్గానికి రెండు…
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… కేసీఆర్ ఆరిపోయే దీపం అంటూ మీడియా చిట్చాట్లో పేర్కొన్న ఆయన.. కేసీఆర్ పని అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుందని జోస్యం చెప్పారు.. ఇక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై స్పందించిన ఈటల… కరీంనగర్లో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని జోస్యం చెప్పారు… కరీంనగర్ నుంచి మాజీ మేయర్ రవీందర్ సింగ్.. ఎమ్మెల్సీగా గెలుస్తారంటూ…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారంతో ముగిసింది. తెలంగాణలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా వీటిలో ఆరు ఏకగ్రీవం అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో రెండు స్థానాలు, మహబూబ్నగర్ జిల్లాలో రెండు స్థానాలు, నిజామాబాద్, వరంగల్ జిల్లాలలో ఒక్కో స్థానాన్ని టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. Read Also: మహిళతో రాసలీలలు… అడ్డంగా దొరికిపోయిన వనపర్తి ఎస్సై రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు… మహబూబ్నగర్ జిల్లా…
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం కొనసాగుతోంది… వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్ది మినహా అందరూ నామినేషన్లు ఉపసహరించుకోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.. దీంతో వరంగల్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానాన్ని టీఆర్ఎస్ మరో సారి నిలబెట్టుకుంది. ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల్లో మెజారిటీ ఉన్న టీఆర్ఎస్ ఈ కోటాలో మండలి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకునేందుకు వేసిన ఎత్తుగడలు…
తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. వీరిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి రంగారెడ్డి నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు ఉన్నారు. వీరి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. ఏకగ్రీవమైనవారికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని రిటర్నింగ్ అధికారులు అందజేస్తారు. స్థానిక సంస్థల కోటాలో తొమ్మిది జిల్లాల్లోని 12 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనున్నారు.…
నిజామాబాద్ : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ గా తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె… కల్వకుంట్ల కవిత ఏక గ్రీవం గా ఎన్నిక అయ్యారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బరిలో లేకపోవడంతో… టీఆర్ఎస్ పార్టీ ఏక గ్రీవంగా విజయం సాధించింది. అయితే.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ ను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. ఇక…
బలం ఉన్నచోట బరి.. బలం లేనిచోట ప్రత్యర్థిపై గురి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ వ్యూహం ఇదేనా? అన్నిచోట్లా కాకుండా.. కొన్నిచోట్లే పోటీ చేయడం వెనక నాయకుల మతలబు ఏంటి? అప్పనంగా అధికారపార్టీకి కట్టబెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఏంటా పార్టీ? వారు వేస్తున్న లెక్కలేంటి? నల్లగొండలో నేతల మధ్య కుదరని సయోధ్య..! తెలంగాణ కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఖమ్మంలో రాయల్ నాగేశ్వరరావు, మెదక్లో నిర్మలా జగ్గారెడ్డికి బీఫామ్…
పోటీ ఉంటే ఎన్నికల్లో ఖర్చు అంచనాలను మించిపోతుంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ల్లో ఏకగ్రీవం అయ్యేచోట కూడా అభ్యర్థులకు కోట్లకు కోట్లు చేతి చమురు వదిలిపోతోందట. వీటికితోడు క్యాంపు రాజకీయాలకు ముందస్తున్న సన్నాహాలు ఊపందుకున్నట్టు కథలు కథలుగా చెప్పుకొంటున్నారు. 12 లోకల్ ఎమ్మెల్సీ స్థానాల్లో 9 వేల మందికిపైగా ఓటర్లు..!క్యాంప్ రాజకీయాలకు ముందస్తు ఏర్పాట్లు..! తెలంగాణలో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు పర్వం ముగిసింది. 9 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న 12…
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 27 మంది 53 సెట్లు నామినేషన్లు దాఖలు చేసారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ తరపున ఎల్ రమణ, బాను ప్రసాద్ రావులు నామినేషన్ వేశారు. అయితే ఈ పోటీకి దూరంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జెడ్పిటిసి, ఎంపిటిసి, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను నియోజకవర్గాల వారిగా…