ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా…
తెలంగాణ ప్రజలకు మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. ఇప్పటివరకు పింఛన్ రాని వారికి ఏప్రిల్ నెల నుంచి నగదు అందజేస్తామని తెలిపారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి.. కొత్తవి మంజూరు చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్కారు పింఛన్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచిందని.. గతంలో ఏడాదికి రూ.800 కోట్లు ఖర్చుచేస్తే కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఏడాదికి ఏకంగా రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని…
రాజ్యాంగం మార్చాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను రాద్దాంతం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా? దేశంలో నరేంద్రమోడీ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఆర్టికల్-3 ప్రకారమే ఏర్పడిందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ మోడీ తన గుప్పిట్లో పెట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థని, ఈసీని మోడీ గుప్పిట్లో పెట్టుకున్నారని ఆయన అన్నారు. మోడీ ఆడించినట్లు ఈ వ్యవస్థలు ఆడేలా చూస్తున్నారని ఆయన విమర్శించారు. పశ్చిమబెంగాల్లో గవర్నర్ను సీఎం బ్లాక్ చేసే…
కుటుంబ పోషణ కోసం ధైర్యంగా ఆటో నడిపిస్తున్న ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని ఆటో గర్ల్ సబితకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతూ పేదరికంలో ఉన్న తన కుటుంబ సభ్యుల కోసం ఆటో నేర్చుకొని తద్వారా ప్రతిరోజు కొన్ని డబ్బులు సంపాదిస్తున్న నల్గొండకు చెందిన సబిత విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన ఆమెకు అండగా ఉండేందుకు నిర్ణయం తీసుకొని, ఈ మేరకు ఆమెకు సహాయం అందించాల్సిందిగా నల్గొండ జిల్లా కలెక్టర్ను…
ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ప్రజల్ని అవమానించారని టీఆర్ఎస్ నేతలు ఆగ్రహంతో వున్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఎర్రబెల్లి, ఎంపీలు బీజేపీ నేతల్ని టార్గెట్ చేశారు. తాజాగా మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా బీజేపీ తీరుని ఎండగట్టారు. ఇది చాలా అవమానకరం. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్ఫూర్తిదాయక పోరాటాన్ని మరియు త్యాగాలను ప్రధాని మోడీ పదే పదే అవమానిస్తున్నారు. ప్రధాని మోడీచేసిన అసంబద్ధ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను…
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ని ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగుల పోరాటంలో రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్కు చెందిన బొగ్గు గనులు తెలంగాణకు పెద్ద ఆస్తులని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ మండిపడ్డారు. నేరుగా సింగరేణికి బొగ్గు గనులు…
తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రేటర్ హైదరాబాద్ లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని, టీఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని రేవంత్రెడ్డి లేఖలో ఆరోపించారు. అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు…
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా మాటల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు ఒకరిపైఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన ట్విట్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన.. “పోలీసులను 15 నిమిషాలు తొలగిస్తే, మేము ముస్లింలు 100 కోట్ల హిందువులను అంతం చేస్తాం” అన్న ఒవైసీ, ఎంఐఎంతో సీఎం కేసీఆర్ , కేటీఆర్ లు కలిసి పొత్తుపెట్టుకోవడం…
సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేసీ సర్కార్ కుట్ర చేస్తోందని ఆరోపించారు తెలంగాణ మంత్రి కేటీఆర్… సింగరేణిలోని నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారంగా తెలిపిన ఆయన.. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం అని హెచ్చరించారు.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందన్న ఆయన.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గత ఏడేళ్ల కాలంలో అద్భుతంగా అభివృద్ధి ప్రస్థానంలో ముందుకు పోతుంది.. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్రకు కేంద్రం తెరలేపిందని…
కేంద్ర బడ్జెట్పై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఎనిమిదో బడ్జెట్లో కూడా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు.. ఒకవైపు పవర్లూం, చేనేత కార్మికులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది.. కానీ, కేంద్రం ప్రభుత్వం ఏడున్నార సంవత్సరాలుగా అండగా నిలబడండని కోరుతున్నా పట్టించుకోవడంలేదన్నారు.. సిరిసిల్లకు మెగా పవర్ రూమ్ క్లస్టర్ ఇవ్వండి అని అడిగినా మొండిచేయి చూపిస్తున్నారన్న ఆయన.. పవర్లూం క్లస్టర్ లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్…