సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్)ని ప్రైవేటీకరించేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వ పథకాలకు వ్యతిరేకంగా సింగరేణి ఉద్యోగుల పోరాటంలో రాష్ట్ర నాయకులు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. సింగరేణి కాలరీస్కు చెందిన బొగ్గు గనులు తెలంగాణకు పెద్ద ఆస్తులని ఆయన అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని కేటీఆర్ మండిపడ్డారు. నేరుగా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కేటీఆర్ లేఖ రాశారు.
జేబీఆర్ఓసీ-3, కేకే-6, శ్రావణ పల్లి ఓసీ, కోయగూడెం బొగ్గు గనులను నేరుగా కంపెనీకి కేటాయించకుండా వేలంలో పాల్గొనాలని ఎస్సీసీఎల్ని కోరడాన్ని మంత్రి తప్పుబట్టారు. బొగ్గు గనులు కేటాయించేందుకు నిరాకరించి సింగరేణిని నష్టాల్లోకి నెట్టేందుకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మంత్రి పేర్కొన్నారు. లాభాల్లో నడుస్తున్న సింగరేణిని బలోపేతం చేసేందుకు కేంద్రం బొగ్గు గనులను కేటాయించాలన్నారు. గనుల కోసం వేలంలో పాల్గొనమని ఎస్సీసీఎల్ను మేనేజ్మెంట్ని ఆదేశించింది. ఇది తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించడమే తప్ప మరొకటి కాదని కేటీఆర్ అన్నారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
తెలంగాణలోని దాదాపు 2000 పరిశ్రమలకు సింగరేణి బొగ్గును సరఫరా చేస్తుందని, సింగరేణిని ప్రైవేటీకరించడం వల్ల తెలంగాణలో పారిశ్రామిక రంగం వృద్ధికి ఆటంకం కలుగుతుందని మంత్రి వివరించారు. ఎస్సీసీఎల్ కేవలం బొగ్గు గని మాత్రమే కాదు, బంగారు గని అని, ఇది వేలాది మంది యువతకు ఉపాధిని కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!