Trump: అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు విఫలమయ్యాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు ఎలాంటి ఒప్పందం లేకుండానే పాకిస్థాన్ నుంచి వెనుదిరిగాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఇరాన్ను "రాతియుగానికి" తిరిగి పంపుతానని ట్రంప్ ఇప్పటికే బెదిరించారు. ఇరాన్ సముద్ర మార్గాలను దిగ్బంధిస్తానని ప్రకటించారు. చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్కు ఊపిరి ఆడకుండా చేసేందుకు 'నావికా దళ దిగ్బంధనం' (Naval Blockade) అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. అమెరికా మధ్యవర్తిత్వంతో ఏప్రిల్ 14న (మంగళవారం) వాషింగ్టన్ వేదికగా అమెరికా ఆధ్వర్యంలో చర్చలకు శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.
US Iran War: మధ్యప్రాచ్యంలో యుద్ధం రోజు రోజుకూ ముదురుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ప్రకటనతో ఇరాన్తో ఉద్రిక్తతలను తీవ్రతరం చేశారు. మంగళవారం సాయంత్రంలోగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే, విద్యుత్ కేంద్రాలు, వంతెనలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఇరాన్ను ఒకే రాత్రిలో తుడిచిపెట్టేయగలమని, అది మంగళవారమే జరగవచ్చని ట్రంప్ ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. మరోవైపు, ఇరాన్ సైతం ఈ హెచ్చరికలపై అంతే తీవ్రంగా స్పందించింది.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది.
Israel vs Muslim World: మధ్యప్రాచ్యంలో ముదిరిన ఉద్రిక్తతలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో పాలస్తీనియన్లకు మరణశిక్ష విధించేలా ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెస్సెట్) ఆమోదించిన నూతన చట్టంపై ముస్లిం ప్రపంచం భగ్గుమంది. ఈ చట్టాన్ని తీవ్రంగా ఖండిస్తూ పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్ సహా ఏడు కీలక ముస్లిం దేశాలు ఒక ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. పాకిస్థాన్, టర్కీ, ఈజిప్ట్, ఇండోనేషియా, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్లో అతి పెద్ద వంతెనను కూల్చేసిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో ఇంకా విధ్వంసం మొదలుపెట్టలేదని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి జారీ చేసిన హెచ్చరికలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఇరాన్లో కొత్తగా ఏర్పడిన అధికార యంత్రాంగంతో సైనిక కార్యకలాపాలను ముగించే విషయమై అమెరికా కీలక చర్చలు జరుపుతోందని ఆయన వెల్లడించారు. ఈ చర్చలు సానుకూల ధోరణిలో సాగుతున్నాయని చెబుతూనే.. ఒకవేళ తక్కువ సమయంలోనే సరైన ఒప్పందం కుదరకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన…
పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది.