US-Iran Conflict: అమెరికా యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించి, ఇరాన్ మాత్రం తగ్గడం లేదు. పశ్చిమాసియా దేశాలకు ఇరాన్ గట్టి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా సైనికులు బస చేస్తున్న హోటళ్లను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు చేస్తామని హెచ్చరించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉన్న యూఎస్ సైనికులు తమ స్థావరాలను వదిలేసి హోటళ్లలో ఆశ్రయం తీసుకుంటున్నారని, అమెరికన్లకు ఆశ్రయం ఇచ్చే హోటళ్లను అమెరికా ఆస్తులుగానే పరిగణిస్తామని హెచ్చరించింది.
పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది.
పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.
Hezbollah Enters Iran-Israel War: ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమెరికా- ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఖమేనీ మృతిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ ఎంట్రీ ఇచ్చింది.. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడికి దిగింది..…