Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
- పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం
- ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు
- అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్
- హార్ముజ్ జలసంధి దగ్గర కూలిన మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Also Read
- Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
- SuperShe Island: పురుషులు లేని ప్రపంచం.. మహిళలకు మాత్రమే ఎంట్రీ! సూపర్ షీ ఐలాండ్ విశేషాలు ఇవే..
- US - Iran Conflict: అగ్రరాజ్యం అమెరికాకు ఉక్రెయిన్ ఊహించని సాయం.. ఇక ఇరాన్కు కష్టమేనా!
- Hantavirus: హంటావైరస్పై ఆందోళన.. వ్యాక్సిన్ లేదు.. మరి చికిత్స ఎలా..?
శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని గగనతలంలో ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒక పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇందులో ఒకరు సేఫ్గా బయట పడగా.. ఇంకొకరు గల్లంతయ్యారు. తొలుత తమ స్వాధీనంలో ఉన్నట్లు ఇరాన్ ప్రకటించగా.. అంతలోనే మాట మార్చింది. సజీవంగా పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇదిలా ఉండగా తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర ఏ-10 థండర్బోల్ట్ II విమానం కూలిపోయింది. అయితే ఈ పైలట్ను అమెరికా సురక్షితంగా రక్షించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధికారుల ప్రకారం.. కూలిపోయిన విమానం ఫెయిర్చైల్డ్ రిపబ్లిక్ A-10 థండర్బోల్ట్ II అని.. దీనిని సాధారణంగా A-10 వార్హాగ్ అని పిలుస్తారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ విమానం హార్ముజ్ జలసంధి సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం గానీ.. పరిస్థితుల గురించి అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తమ వాయు రక్షణ వ్యవస్థలు శత్రువుకు చెందిన A-10 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజావార్తలు
-
Naga Vamsi: డిస్ట్రిబ్యూటర్లను చంపి ఎగ్జిబిటర్లను కాపాడటం సాధ్యమా?:
-
Karnataka: కేరళం పంచాయితీ ముగియకుండానే కర్ణాటకలో రేగిన వర్గపోరు.. వెలసిన డీకే.శివకుమార్ కటౌట్లు
-
CM Chandrababu Naidu: వర్క్ ఫ్రం హోంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Amul milk: సామాన్యుడి జేబుకు ‘అముల్’ చిల్లు.. రేపటి నుంచే పాలకు కొత్త రేట్లు! ఎంత ధర పెరిగాయంటే..
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!