Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
- పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం
- ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు
- అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్
- హార్ముజ్ జలసంధి దగ్గర కూలిన మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Also Read
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- 39 సెకన్లలో దాదాపు లక్ష మంది మృతి?.. Venezuela Earthquakeపై షాకింగ్ రిపోర్ట్..
- Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
- US Citizenship Fee Hike: ఎన్నారైలకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న అమెరికా సిటిజన్షిప్ ఫీజులు?
శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని గగనతలంలో ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒక పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇందులో ఒకరు సేఫ్గా బయట పడగా.. ఇంకొకరు గల్లంతయ్యారు. తొలుత తమ స్వాధీనంలో ఉన్నట్లు ఇరాన్ ప్రకటించగా.. అంతలోనే మాట మార్చింది. సజీవంగా పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇదిలా ఉండగా తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర ఏ-10 థండర్బోల్ట్ II విమానం కూలిపోయింది. అయితే ఈ పైలట్ను అమెరికా సురక్షితంగా రక్షించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధికారుల ప్రకారం.. కూలిపోయిన విమానం ఫెయిర్చైల్డ్ రిపబ్లిక్ A-10 థండర్బోల్ట్ II అని.. దీనిని సాధారణంగా A-10 వార్హాగ్ అని పిలుస్తారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ విమానం హార్ముజ్ జలసంధి సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం గానీ.. పరిస్థితుల గురించి అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తమ వాయు రక్షణ వ్యవస్థలు శత్రువుకు చెందిన A-10 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..