Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
- పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం
- ఇరాన్-అమెరికా మధ్య భీకర దాడులు
- అమెరికా యుద్ధ విమానాలను టార్గెట్ చేసుకున్న ఇరాన్
- హార్ముజ్ జలసంధి దగ్గర కూలిన మరో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్-అమెరికా మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇరాన్లోని అతిపెద్ద వంతెనను అమెరికా కూల్చేసిన తర్వాత పరిణామాలు కఠినంగా మారాయి. ప్రస్తుతం అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ టార్గెట్ చేసుకుంది.
ఇది కూడా చదవండి: Delhi Rain: ఢిల్లీలో వర్షం.. పలు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Also Read
- IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
- Mosquito Repellent Study: షాకింగ్.. స్ప్రే వాసనకు పారిపోవడం కాదు.. ఆకర్షితమవుతున్న దోమలు..!
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
- Trump: వైట్హౌస్ సిట్యుయేషన్ రూమ్లో కీలక భేటీ.. శాంతి ఒప్పందంపై తేల్చేయనున్న ట్రంప్
శుక్రవారం అమెరికా వైమానిక దళానికి చెందిన ఎఫ్-15ఈ స్టైక్ ఈగిల్ యుద్ధ విమానాన్ని గగనతలంలో ఇరాన్ కూల్చేసింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ఒక పైలట్, ఇంకొకరు వెపన్ సిస్టమ్ ఆఫీసర్ ఉన్నారు. అయితే ఇందులో ఒకరు సేఫ్గా బయట పడగా.. ఇంకొకరు గల్లంతయ్యారు. తొలుత తమ స్వాధీనంలో ఉన్నట్లు ఇరాన్ ప్రకటించగా.. అంతలోనే మాట మార్చింది. సజీవంగా పట్టుకుంటే బహుమతి ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇప్పటికీ అతడి ఆచూకీ లభించలేదు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..
ఇదిలా ఉండగా తాజాగా హార్ముజ్ జలసంధి దగ్గర ఏ-10 థండర్బోల్ట్ II విమానం కూలిపోయింది. అయితే ఈ పైలట్ను అమెరికా సురక్షితంగా రక్షించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అమెరికా అధికారుల ప్రకారం.. కూలిపోయిన విమానం ఫెయిర్చైల్డ్ రిపబ్లిక్ A-10 థండర్బోల్ట్ II అని.. దీనిని సాధారణంగా A-10 వార్హాగ్ అని పిలుస్తారని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. ఈ విమానం హార్ముజ్ జలసంధి సమీపంలో కూలిపోయింది. ప్రమాదానికి గల కారణం గానీ.. పరిస్థితుల గురించి అధికారులు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. ఇదిలా ఉండగా తమ వాయు రక్షణ వ్యవస్థలు శత్రువుకు చెందిన A-10 విమానాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా కీలక నేతలంతా హతమయ్యారు. దీంతో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్లోని కీలక ప్రాంతాలను అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. ఇక ఇరాన్ కూడా ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై దాడులు చేశాయి. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని మూసేశాయి. దీంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది.
ఇదిలా ఉంటే ఇటీవల అమెరికా ప్రజలను ఉద్దేశించి ట్రంప్ కీలక ప్రసంగం చేశారు. 2, 3 వారాల్లో ఇరాన్ అంతు చూస్తామని.. ఇదంతా అమెరికా భవిష్యత్ కోసమే చేస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
తాజావార్తలు
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
-
Kumar Sangakkara: కెప్టెన్ పరాగ్ మాటలను బహిరంగంగా ఖండించిన కోచ్ సంగక్కర.. అసలు రాజస్థాన్లో ఏం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..