Amazon Huge Loss: ప్రపంచ ప్రఖ్యాత ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సంపదను భారీగా నష్టపోయింది. గడచిన ఏడాది కాలంలో కంపెనీ లక్ష డాలర్ల (సుమారు మన కరెన్సీలో రూ.82 లక్షల కోట్లు) మార్కెట్ విలువను కోల్పోయింది.
ఫ్లిప్కార్ట్తో రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఎంవోయూ కుదుర్చుకుంది.. ఈ భాగస్వామ్యం ద్వారా, ఫ్లిప్కార్ట్ తన ప్లాట్ఫారమ్లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులకు పాన్-ఇండియా మార్కెట్ యాక్సెస్ను అందించడం ద్వారా స్థానిక వ్యవసాయ సంఘాలు మరియు తెలంగాణలోని స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈమధ్యకాలంలో వన్యప్రాణులు అరణ్యాలు వీడి జనవాసాలకు చేరుతున్నాయి. చిరుతలు జనం మీదకు వస్తున్నాయి. ఇళ్ళలో వుండే ఆవులు, మేకలు, గొర్రెల్ని హతమారుస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లో కూరగాయల ట్రేలో దూరిందో చిరుత కూన. చంద్రపూర్ జిల్లాలోని మూల్ తాలూకా లోని ఉథడ్ పేట్ గ్రామ రైతు కిన్నకే అనే రైతు కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పొలంలో కూరగాయలు తెంపి ట్రే లో పోసే క్రమంలో పై కప్పి ఉంచిన గోతాన్ని తీశాడు. అప్పటికే అక్కడ చిరుతపులి…
ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.. ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ…
ఉక్రెయిన్పై రష్యా భీకర స్థాయిలో దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా చర్యలను ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. అటు రష్యా కూడా ఎప్పుడు ఏం జరుగుతోంది తెలియక సతమతం అవుతోంది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రష్యా ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే.. అది కండోమ్ అని ఆ దేశపు ప్రముఖ ఆన్లైన్ రీటెయిలర్ వైల్డ్బెర్రీస్ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ప్రస్తుతం రష్యాలో కండోమ్ అమ్మకాలు 170 శాతం పెరిగాయని…
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న యుద్ధం భారత్లోని సామాన్యుడిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వార్ కారణంగా ఇప్పటికే భారత్లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఉన్న స్టాక్ను వ్యాపారులు బ్లాక్ చేసేస్తున్నారు. దీంతో బహిరంగ మార్కెట్లో వంటనూనెలకు కొరత ఏర్పడుతోంది. ఒకవేళ వంటనూనెల ప్యాకెట్లు అందుబాటులో ఉన్నా వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ కారణంగా సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లోని డీమార్ట్ వంటి పెద్ద షాపింగ్ మాళ్లలో లిమిటెడ్గా వంటనూనెల ప్యాకెట్లను…
పాకిస్థాన్లో భారీలు పేలుడు సంభవించింది.. లాహోర్లోని అనార్కలి మార్కెట్ పాన్ మండి దగ్గర జరిగిన భారీ బాంబు పేలుడులో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.. ఈ ఘటనలో మరో 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనట్టు పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఇక, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.. బాంబు పేలుడుపై మీడియాతో మాట్లాడిన లాహోర్ పోలీసులు.. ముగ్గురు మరణించినట్టు వెల్లడించారు.. ఇక, ప్రమాదం జరిగిన…