Mamata Banerjee: వక్ఫ్(సవరణ) బిల్లుపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ సోమవారం స్పందించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై మడిపడ్డారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకురావడం అనుమానాలకు కారణమవుతుందని ఆరోపించారు.
Mamata Banerjee: బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువుల అణిచివేత జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రముఖ హిందూ నేతల్ని అక్కడి మహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తోంది. రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్ల కారణంగా షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశవ్యాప్తంగా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయి. గుడులు, హిందూ వ్యాపారాలు, ఇళ్లపై దాడులు చేస్తూనే ఉన్నారు.
Hemant Soren: జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ఈరోజు ( గురువారం) ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాంచీలోని మొరాబాది స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీని ప్రభావం ఇప్పుడు భారత కూటమిపై కూడా కనిపిస్తోంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా తన పాత్రను కోల్పోవడం ప్రారంభించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతల తాజా డిమాండ్తో ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరింది. కూటమిలో కాంగ్రెస్ వెనక్కి తగ్గాలని, ప్రతిపక్ష కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని టీఎంసీ నుంచి నాలుగుసార్లు లోక్సభ ఎంపీగా…
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది.
Abhishek Banerjee: మమతా బెనర్జీ రాబోయే తరానికి రాజకీయాలను అప్పగించాలనుకుంటున్నారా? ఈ ప్రశ్న గత కొన్ని రోజులుగా కోల్కతా వీధుల నుండి ఢిల్లీ వరకు ప్రజల వరకు మదిలో మెదులుతోంది. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ 37వ పుట్టినరోజు సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. డైమండ్ హార్బర్ ఎంపీనే తదుపరి ముఖ్యమంత్రి కాగలరని రాజ్యసభకు చెందిన టీఎంసీ మాజీ ఎంపీ కునాల్…
కోల్కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇక వైద్యులకు భద్రత కల్పించాలంటూ గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు నిరవధిక నిరాహార దీక్ష చేస్తు్న్నారు. వీరికి మద్దతుగా సీనియర్ డాక్టర్లు కూడా రాజీనామాలు కూడా సమర్పించారు.
Kolkata Doctor Case: కోల్కతా ట్రైనీ వైద్యురాలి అత్యాచారం, హత్య సంఘటన తర్వాత యావత్ దేశంలో నిరసన, ఆందోలనలు నెలకొన్నాయి. ఇప్పటికీ బెంగాల్ వ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతూనే ఉన్నారు. ఇదిలా ఉంటే, సోమవారం డాక్టర్లతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం విజయవంతమైంది. ఆరు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో డాక్టర్ల డిమాండ్లకు సీఎం తలొగ్గారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో జూనియర్ డాక్టర్ల సమావేశం ముగిసింది. కాళీఘాట్ నివాసంలో ఆమెతో రెండు గంటల పాటు చర్చలు జరిపారు. పోలీస్ ఎస్కార్ట్ వాహనంతో 30 మంది వైద్యులు సాయంత్రం 6:20 గంటలకు ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.