West Bengal : మమతా బెనర్జీకి రూ.11 కోట్లకు నోటీసు పంపిన బెంగాల్ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, గవర్నర్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కునాల్ ఘోష్, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం నోటీసు పంపారు. గవర్నర్ బోస్ పంపిన ఈ నోటీసులో ….‘‘మీరు గవర్నర్ను అప్రతిష్టపాలు చేశారు. ఈ విషయంలో వెంటనే క్షమాపణ చెప్పకపోతే వారిపై ఒక్కొక్కరిపై రూ.11 కోట్ల పరువు నష్టం దావా వేస్తారు.’’ అంటూ రాసుకొచ్చారు. ఈ నోటీసును కొత్తగా ఎన్నికైన తృణమూల్ ఎమ్మెల్యేలు సయంతిక బెనర్జీ, రాయత్ హుస్సేన్ సర్కార్లకు పంపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు పరువు నష్టం నోటీసు పంపారు.
Read Also:Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Also Read
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ నోటీసు అసలు విషయం ఏమిటి?
మే 2024లో బెంగాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో బారానగర్ స్థానం నుండి సయంతికా బెనర్జీ, భగవంగోలా స్థానం నుండి రాయత్ సర్కార్ గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక సమస్య ఏర్పడింది. గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ కు ప్రమాణ స్వీకారం చేసే హక్కు ఇవ్వలేదు. గవర్నర్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ వారిద్దరితో ప్రమాణం చేయించాలని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. రాజ్ భవన్ సురక్షితం కాదని ఈ ఎమ్మెల్యేలు అన్నారు. ఈ మొత్తం సంఘటన జరుగుతున్నప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్ భవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రాజ్ భవన్ లో మహిళలకు భద్రత లేదని మమత అన్నారు.
Read Also:Pamban Bridge : ప్రారంభానికి సిద్ధంగా కొత్త పంబన్ బ్రిడ్జీ.. 30 నిమిషాల దూరం కేవలం 5 నిమిషాల్లోనే
అయితే, రాజ్ భవన్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోల్కతా హైకోర్టు మమతను కోరింది. ఈ సంఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు గవర్నర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనికి ఇప్పుడు లీగల్ నోటీసు పంపారని చెబుతున్నారు. గవర్నర్ సివి బోస్ పంపిన పరువు నష్టం నోటీసులో రూ.11 కోట్లు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సయంతిక బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 45 లక్షలు, రాయత్ హుస్సేన్ సర్కార్ మొత్తం ఆస్తులు రూ. 3 కోట్లు. సయంతిక బెంగాలీ సినీ నటి కాగా, సర్కార్ తన రాజకీయ జీవితాన్ని తృణమూల్ కాంగ్రెస్తో ప్రారంభించారు. కాగా మమతా బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 16 లక్షలు. ఈ విషయాన్ని మమత ఇటీవల వెల్లడించారు.
తాజావార్తలు
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?