West Bengal : మమతా బెనర్జీకి రూ.11 కోట్లకు నోటీసు పంపిన బెంగాల్ గవర్నర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, గవర్నర్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కునాల్ ఘోష్, ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గవర్నర్ సివి ఆనంద్ బోస్ పరువు నష్టం నోటీసు పంపారు. గవర్నర్ బోస్ పంపిన ఈ నోటీసులో ….‘‘మీరు గవర్నర్ను అప్రతిష్టపాలు చేశారు. ఈ విషయంలో వెంటనే క్షమాపణ చెప్పకపోతే వారిపై ఒక్కొక్కరిపై రూ.11 కోట్ల పరువు నష్టం దావా వేస్తారు.’’ అంటూ రాసుకొచ్చారు. ఈ నోటీసును కొత్తగా ఎన్నికైన తృణమూల్ ఎమ్మెల్యేలు సయంతిక బెనర్జీ, రాయత్ హుస్సేన్ సర్కార్లకు పంపారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక గవర్నర్ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు పరువు నష్టం నోటీసు పంపారు.
Read Also:Thala Movie: గ్రాండ్ గా నిర్వహించిన ‘తల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
Also Read
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
- Virat Kohli: రాబోయే వన్డే వరల్డ్ కప్లో కోహ్లీ, రోహిత్ ఆడతారా?.. బాంబు పేల్చిన కెప్టెన్ గిల్
ఆ నోటీసు అసలు విషయం ఏమిటి?
మే 2024లో బెంగాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో బారానగర్ స్థానం నుండి సయంతికా బెనర్జీ, భగవంగోలా స్థానం నుండి రాయత్ సర్కార్ గెలిచారు. ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక సమస్య ఏర్పడింది. గవర్నర్ అసెంబ్లీ స్పీకర్ కు ప్రమాణ స్వీకారం చేసే హక్కు ఇవ్వలేదు. గవర్నర్ మాట్లాడుతూ.. డిప్యూటీ స్పీకర్ వారిద్దరితో ప్రమాణం చేయించాలని అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజ్ భవన్ కు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. రాజ్ భవన్ సురక్షితం కాదని ఈ ఎమ్మెల్యేలు అన్నారు. ఈ మొత్తం సంఘటన జరుగుతున్నప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజ్ భవన్ గురించి తీవ్రమైన వ్యాఖ్య చేశారు. రాజ్ భవన్ లో మహిళలకు భద్రత లేదని మమత అన్నారు.
Read Also:Pamban Bridge : ప్రారంభానికి సిద్ధంగా కొత్త పంబన్ బ్రిడ్జీ.. 30 నిమిషాల దూరం కేవలం 5 నిమిషాల్లోనే
అయితే, రాజ్ భవన్ గురించి అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోల్కతా హైకోర్టు మమతను కోరింది. ఈ సంఘటనలో ఇద్దరు ఎమ్మెల్యేలు గవర్నర్పై తీవ్రమైన ఆరోపణలు చేశారని, దీనికి ఇప్పుడు లీగల్ నోటీసు పంపారని చెబుతున్నారు. గవర్నర్ సివి బోస్ పంపిన పరువు నష్టం నోటీసులో రూ.11 కోట్లు ప్రస్తావించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సయంతిక బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 45 లక్షలు, రాయత్ హుస్సేన్ సర్కార్ మొత్తం ఆస్తులు రూ. 3 కోట్లు. సయంతిక బెంగాలీ సినీ నటి కాగా, సర్కార్ తన రాజకీయ జీవితాన్ని తృణమూల్ కాంగ్రెస్తో ప్రారంభించారు. కాగా మమతా బెనర్జీ మొత్తం ఆస్తులు రూ. 16 లక్షలు. ఈ విషయాన్ని మమత ఇటీవల వెల్లడించారు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!