Amit Shah: అంబేద్కర్పై వ్యాఖ్యలు.. అమిత్షాపై తృణమూల్ ప్రివిలేజ్ నోటీసులు.. .
- అమిత్ షా ‘‘అంబేద్కర్’’ వ్యాఖ్యలపై కలకలం..
- ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన టీఎంసీ..
Amit Shah: రాజ్యసభలో అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై ప్రతిపక్ష పార్టీలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ నోటీసులు పంపింది. రాజ్యాంగ నిర్మాత వారసత్వాన్ని, పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొంది. రాజ్యసభలో టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ రూల్ 187 కింది నోటీసులు అందించారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి అమిత్ షా చేసిన ప్రసంగం నుంచి ఈ వివాదం మొదలైంది.
రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడుతూ.. ‘‘బీఆర్ అంబేద్కర్ పేరుని చెప్పడం ప్రతిపక్షాలకు ఫ్యాషన్ అయింది. అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ , అంబేద్కర్ అని చెప్పుకోవడం ఫ్యాషన్ గా మారిపోయిందని, ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో చోటు దక్కేది.’’ అని ఆయన అన్నారు. నెహ్రూ ప్రభుత్వంతో విభేదించి అంబేద్కర్ రాజీనామా చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Matrimonial fraud: విగ్గురాజా మామూలోడు కాదు.. 50 మందిని మోసం చేసిన నిత్య పెళ్లి కొడుకు
ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారాన్ని రేపాయి. అమిత్ షా దళితులను అవమానించారని కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఆరోపించాయి. అంబేద్కర్కి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. అయితే, అమిత్ షా ప్రసంగంలోని చిన్న క్లిప్ని మాత్రమే కాంగ్రెస్ వైరల్ చేసిందని బీజేపీ ఆరోపించింది. అమిత్ షా రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది.
మరోవైపు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ‘‘ముసుగు తొలిగిపోయింది’’ అంటూ ట్వీట్ చేశారు. ‘‘అమిత్ షా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించాలని అనుకున్నారు. ఇది బీజేపీ కులతత్వ, దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనం. 240 సీట్లు గెలిచిన తర్వాత ఇలా వ్యవహరిస్తే, ఒక వేళ 400 సీట్లు గెలిస్తే ఎలా ఉండేదో ఆలోచించుకోంది. వారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచివేసేవారు’’ అని ఆమె ఎక్స్లో ఫైర్ అయ్యారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!