BJP: బీజేపీ అధికారం వస్తే మమతా బెనర్జీకి జైలు..
- మరోసారి రాజకీయంగా మారిన ‘‘సందేశ్ఖాలీ’’..
- బీజేపీ వర్సెస్ టీఎంసీగా మారిన అంశం..
- బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీ జైలుకే..
- సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. తాజా, బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. సందేశ్ఖాలీలో జరిగిన దురాగతాలపై విచారణ జరుపుతామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆయన అన్నారు.
Read Also: Xi Jinping: “ఎవరూ ఆపలేరు”.. న్యూఇయర్ సందేశంలో తైవాన్కి చైనా వార్నింగ్..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
మంగళవారం ఆయన ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్ఖాలీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘జరిగిన దాన్ని మరిచిపోవాలని మమత ప్రజల్ని కోరుతున్నారు. సందేశ్ఖాలీ ప్రజలు మరిచిపోరు. నేను కూడా మరిచిపోను. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్ఖాలీ ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు సందేశ్ఖాలీ మహిళల్ని జైలుకు పంపారు. మహిళలపై తప్పుడు కేసులు పెట్టారు. బీజేపీ మిమ్మల్ని కూడా జైలుకు పంపుతుంది’’ అని అన్నారు. మేము చట్ట ప్రకారం వడ్డీతో ప్రతీకారం తీర్చుకుంటామని టీఎంసీని మెచ్చరించారు. షేక్ షాజహాన్ వంటి బలమైన టీఎంసీ నేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడినందుకు, మహిళలపై తప్పుడు కేసులు పెట్టాలని మమతా బెనర్జీ కుట్ర పన్నారని అధికారి ఆరోపించారు.
సువేందు పర్యటకు ఒక రోజు ముందు మమతా బెనర్జీ సందేశ్ఖాలీని సందర్శించారు. 2024లో టీఎంసీ నేతకు వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు చెలరేగిన తర్వాత ఆమె తొలిసారిగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఆరోపణల వెనక పెద్ద ఆట దాగుందని, డబ్బుతో కుట్ర పన్నుతున్నారని, ప్రజలంతా అది అబద్ధమని గ్రహించారని మమత అన్నారు
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..