PM Modi: చొరబాటుదారుల కోసం మమతా బెనర్జీ కోర్టులకు వెళ్తోంది..
- తృణమూల్ అక్రమ వలసదారుల్ని రక్షిస్తోంది..
- వారి కోసం కోర్టులకు వెళ్తోంది..
- మమతా బెనర్జీపై మోడీ ధ్వజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారుల్ని రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్తోందని అన్నారు. మమతా బెనర్జీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ధ్వజం..
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు SIRకి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. దేశ యువత కోసం ఉద్దేశించిన అవకాశాలను అక్రమ వలసదారులు దొంగిలిస్తు్న్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ కేవలం అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, ప్రజల గురించి కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారుల్ని తమ భూభాగాల నుంచి బహిష్కరిస్తున్నాయని, కానీ మన దేశంలో కొన్ని గ్రూపులు ఉద్దేశపూర్వకంగా అక్రమ వలసదారుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ వలసదారుల గురించి మాట్లాడే నేతల్ని దేశ యువత ఎలా అంగీకరించగలదని ప్రశ్నించారు.
చొరబాటుదారులు వారి ఉద్యోగాలు, జీవనోపాధిని లాక్కుంటున్నారని, గిరిజనుల భూమిని లాక్కుంటున్నారని, మన కుమారులు-కుమార్తెలక భద్రత, భవిష్యత్తుకు ముప్పు సృష్టిస్తున్నారని అన్నారు. తృణమూల్ దాని మిత్రపక్షాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. “కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, లేదా వామపక్షాలు అయినా, వారు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారని వారంతా తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!