PM Modi: చొరబాటుదారుల కోసం మమతా బెనర్జీ కోర్టులకు వెళ్తోంది..
- తృణమూల్ అక్రమ వలసదారుల్ని రక్షిస్తోంది..
- వారి కోసం కోర్టులకు వెళ్తోంది..
- మమతా బెనర్జీపై మోడీ ధ్వజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారుల్ని రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్తోందని అన్నారు. మమతా బెనర్జీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ధ్వజం..
Also Read
- Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై 'లవ్ యూ' నోట్!
- Bhojshala Case: "భోజ్శాల ఆలయం కాదు".. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- VD Satheesan Oath Ceremony: రేపే కేరళంలో కొలువుదీరనున్న కొత్త సర్కార్.. ఛీప్ గెస్ట్లు వీరే!
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు SIRకి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. దేశ యువత కోసం ఉద్దేశించిన అవకాశాలను అక్రమ వలసదారులు దొంగిలిస్తు్న్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ కేవలం అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, ప్రజల గురించి కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారుల్ని తమ భూభాగాల నుంచి బహిష్కరిస్తున్నాయని, కానీ మన దేశంలో కొన్ని గ్రూపులు ఉద్దేశపూర్వకంగా అక్రమ వలసదారుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ వలసదారుల గురించి మాట్లాడే నేతల్ని దేశ యువత ఎలా అంగీకరించగలదని ప్రశ్నించారు.
చొరబాటుదారులు వారి ఉద్యోగాలు, జీవనోపాధిని లాక్కుంటున్నారని, గిరిజనుల భూమిని లాక్కుంటున్నారని, మన కుమారులు-కుమార్తెలక భద్రత, భవిష్యత్తుకు ముప్పు సృష్టిస్తున్నారని అన్నారు. తృణమూల్ దాని మిత్రపక్షాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. “కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, లేదా వామపక్షాలు అయినా, వారు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారని వారంతా తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..