PM Modi: చొరబాటుదారుల కోసం మమతా బెనర్జీ కోర్టులకు వెళ్తోంది..
- తృణమూల్ అక్రమ వలసదారుల్ని రక్షిస్తోంది..
- వారి కోసం కోర్టులకు వెళ్తోంది..
- మమతా బెనర్జీపై మోడీ ధ్వజం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రక్షాళన కార్యక్రమం ‘‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)’’పై పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ రాజ్యసభలో లేవనెత్తారు. రాష్ట్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతూ.. మమతా బెనర్జీపై విమర్శలు గుప్పించారు. అక్రమ వలసదారుల్ని రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ కోర్టుకు వెళ్తోందని అన్నారు. మమతా బెనర్జీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆయన విమర్శలు గుప్పించారు.
Read Also: PM Modi: ‘‘నో విజన్, నో ఐడియా, నో ప్లాన్’’.. కాంగ్రెస్పై ప్రధాని మోడీ ధ్వజం..
Also Read
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
- Ivolga high-speed train: భారత్కు రష్యా బంపర్ ఆఫర్.. హైస్పీడ్ ‘‘ఇవోల్గా’’ రైలు ప్రతిపాదన..
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిన్న భారత ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు SIRకి వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. దేశ యువత కోసం ఉద్దేశించిన అవకాశాలను అక్రమ వలసదారులు దొంగిలిస్తు్న్నారని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. టీఎంసీ కేవలం అధికారం గురించి మాత్రమే ఆలోచిస్తుందని, ప్రజల గురించి కాదని అన్నారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు కూడా అక్రమ వలసదారుల్ని తమ భూభాగాల నుంచి బహిష్కరిస్తున్నాయని, కానీ మన దేశంలో కొన్ని గ్రూపులు ఉద్దేశపూర్వకంగా అక్రమ వలసదారుల్ని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అక్రమ వలసదారుల గురించి మాట్లాడే నేతల్ని దేశ యువత ఎలా అంగీకరించగలదని ప్రశ్నించారు.
చొరబాటుదారులు వారి ఉద్యోగాలు, జీవనోపాధిని లాక్కుంటున్నారని, గిరిజనుల భూమిని లాక్కుంటున్నారని, మన కుమారులు-కుమార్తెలక భద్రత, భవిష్యత్తుకు ముప్పు సృష్టిస్తున్నారని అన్నారు. తృణమూల్ దాని మిత్రపక్షాలు అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. “కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, లేదా వామపక్షాలు అయినా, వారు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నారని వారంతా తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే పనిచేశారని ఆరోపించారు.
తాజావార్తలు
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
-
Ukarine War: ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, జిన్పింగ్ సాయం.. ట్రంప్కు షాకిస్తూ రష్యా కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!