మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సంగీతం ఏ లెవెల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొదలు, పాటల దాకా ప్రత్యేక దృష్టిపెడుతారు. అంతేకాదు, సంగీత దర్శకులతోను మంచి వాతావరణం ఏర్పరచుకొని.. తనకు కావాల్సిన ట్యూన్స్ వచ్చే దాకా కథను పూర్తిగా వారి మదిలో నింపేస్తుంటారు. అందుకే ఆయన సినిమాలో సంగీతం అంత స్పెషల్ గా ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రమ్-సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై…
అడవి శేష్ ‘మేజర్’ సినిమాకు హిందీలో బంపర్ ఆఫర్ తగిలింది. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకు క్రేజీ ఆఫర్ వచ్చింది. సాటిలైట్ రైట్స్ రూపంలో కోట్లు కొల్లగొట్టింది ‘మేజర్’ సినిమా.అడవి శేష్ టైటిల్ రోల్ లో తెరకెక్కుతోన్న ‘మేజర్’ మూవీ అమర జవాన్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందింది. ఆయన ‘26/11’ ముంబై ఉగ్ర దాడుల్లో దేశాన్ని రక్షిస్తూ ప్రాణ త్యాగం చేశాడు. మేజర్ ఉన్నికృష్ణన్ గా శేష్…
2017 నుండి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా రామాయాణ గాథను త్రీడీలో మూడు భాషల్లో, మూడు భాగాలుగా నిర్మించాలని కలలు కంటున్నారు. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకునే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను నితేశ్ తివారి, రవి ఉద్యావర్ భుజానకెత్తుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో రావణాసురుడి పాత్రను హృతిక్ రోషన్, సీతగా దీపికా పదుకునే నటిస్తారనే వార్త బాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. Read Also: ‘కలర్స్’…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా తనయుడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో ‘హీరో’గా ఎంట్రీ ఇస్తున్నాడు. నిజానికి దిల్ రాజు లాంచ్ చేయాల్సిన అశోక్ ను ఇప్పుడు ఆయన తండ్రి జయదేవ్ గల్లానే ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను,…
సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ విడుదల కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్…
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే మరో 50 రోజులు ఉందనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం మొదలైపోయింది. ఇప్పటినుంచే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోషల్ మీడియాలో తాజాగా ఇండియా వ్యాప్తంగా #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఇండియా ట్రెండ్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2వ స్థానంలో #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ నిలవడం విశేషం. దీంతో…
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దాదాపు 11 ఏళ్ల తర్వాత సినిమా చేయబోతున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అధికారికంగా ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చినప్పటికీ.. జులైలో పూజా కార్యక్రమాలు ప్రారంభించనున్నారట. కాగా ఆగష్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుందని సమాచారం. మరోవైపు మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా…
న్యాచురల్ స్టార్ నాని తన నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై హీరో సత్యదేవ్, రూపతో కలిసి ‘దారే లేదా’ అనే సందేశాత్మక సాంగ్ విడుదల చేశారు. కోవిడ్ సమయంలో సేవలు అందించిన డాక్టర్లకు, ఫ్రంట్వర్కర్స్ల కృషికి ఈ సాంగ్ పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అనేలా స్పందన లభిస్తుంది. ‘మబ్బే కమ్మిందా..లోకం ఆగిందా! మాతో కాదంటూ..చూస్తూ ఉండాలా..దారే లేదా..! గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్న.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తి సురేశ్ కథనాయిక నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగు జరుపుకుంటూ ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లాక్ డౌన్ ఎత్తివేయడంతో త్వరలోనే షూటింగ్స్ ప్రారంభం కానున్నాయి.…
సినీ ప్రపంచంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ఆయన పిల్లలకు కూడా అంత క్రేజ్ ఉంది. మహేష్ సతీమణి నమ్రత తరచుగా వారి ఫ్యామిలీ పిక్స్, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేసుకున్నారు నమ్రత. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేని తెలంగాణ స్టేట్ స్విమ్మింగ్ పోటీలో టాప్ 8 ఈతగాళ్ళ లిస్ట్ లో స్థానాన్ని సంపాదించాడని నమ్రత వెల్లడించారు. Also Read :…