Chhatrapati Shivaji: ఛత్రపతి శివాజీ మహారాజ్ 1659లో వాడిని ఆయుధం పులి పంజా ఆకారంలో ఉండే ‘వాఘ్ నఖ్’ భారతదేశానికి రాబోతోంది. నవంబర్ నెలలో లండన్ నుంచి భారత్ కి ఈ ఆయధాన్ని తీసుకురానున్నారు. దీన్ని తీసుకువచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సుధీర్ ముంగంటివార్ అవసరమైన ఒప్పందంపై మంగళవారం లండన్ లో సంతకాలు చేయనున్నారు.
Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.
ప్రస్తుతం దేశంలో ఎక్కడ చూసినా జమిలీ ఎన్నికలు, లేదా రాజకీయ ఎత్తుగడల గురించే చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఏవిధంగా గెలవాలి అనే దానిపై ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రెండూ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ సందర్భంగానే మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి వైరల్ గా మారింది. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. Also Read: Kushal Malla Fastest Century: మిల్లర్, రోహిత్ రికార్డు…
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు తృటిలో ప్రమాదం తప్పింది. పుణెలోని ఓ వినాయక మండపంలో దర్శనానికి వెళ్లిన సమయంలో ఆలయ మండపం పైభాగంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
కొంతమంది అమ్మాయిలు, వారి ప్రవర్తన చూస్తుంటే ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అనిపిస్తుంది. అచ్చం సినిమాలో చూపించే విలన్స్ లానే బెదిరస్తూ , రోడ్లపై ఎలా పడితే అలా తిరుగుతూ ఉంటారు. వారికి పోలీసులు అన్న కూడా అస్సలు భయం ఉండదు. ఇలాగే రెచ్చిపోయిన ఓ మహిళ పోలీసులను సైతం బెదిరించింది. బుల్లెట్ బైక్ నడుపుతూ వచ్చిన ఆ మహిళ పోలీసులను పచ్చి బూతులు తిడుతూ, బైక్ పై చేయి వేస్తే నరికేస్తా అంటూ బెదిరించింది. దీనికి…
మహారాష్ట్రలోని నాగ్పూర్లో శనివారం కురిసిన భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో కేవలం నాలుగు గంటల్లో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా అధికారులు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.
PM Modi: మహారాష్ట్రలోని మురికివాడల్లో నివసించే ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలో వేలాది కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం కానుంది. వారు ఇకపై వర్షం, చలి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
Child Deaths: మహారాష్ట్రలో చిన్నారుల మరణాలు కలకలం రేపుతున్నాయి. నందుర్బార్ లోని సివిల్ ఆస్పత్రిలో గత మూడు నెలల్లో 179 మంది చిన్నారులు మరణించారు. ఈ ఉదంతంపై నందుర్బార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సావన్ కుమార్ స్పందించారు. పిల్లల మరణాలకు అనేక ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయని వెల్లడించారు.