Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
Maharashtra: తప్పుడు మాటలు చెబుతూ, చేతబడులను, దోషాలను వదిలిస్తామంటూ కొందరు బాబాలు, మాంత్రికులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే జరిగింది. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వాస్తుదోషాలు, చెడు దోషాలు వదిలిస్తానని చెబుతూ 35 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా బాధితురాలి భర్త స్నేహితులే అని పోలీసులు వెల్లడించారు. మహిళ భర్తకు ఏదో చెడు శక్తి ఆవహించిందని, ఇవన్నీ తొలిగిపోవాలంటే కొన్ని ఆచారాలు చేయాలని వారు మహిళకు చెప్పారు. నిందితుడు ఏప్రిల్ 2018 నుంచి బాధితురాలి ఇంటికి తరుచూ వస్తున్నాడు. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో కొన్ని పూజలు చేస్తాడు. పంచామృతం అని పిలిచే ఓ డ్రింక్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేసేవాడని పోలీసులు తెలిపారు.
Also Read
- Newlyweds: కూకట్ పల్లిలో విషాదం.. నవ దంపతులు ఆ*త్మహ*త్య
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
Read Also: Anantnag Encounter: 5 రోజులుగా ఎన్కౌంటర్.. ఇంకా చిక్కని ఉగ్రవాదులు.. ఆర్మీకి సవాళ్లు..
భర్తకు నయం కావాలని, ప్రభుత్వం ఉద్యోగం దొరకాలని ఆ మహిళ, నిందితుడు చెప్పిందల్లా వినడమే కాకుండా బంగారం, డబ్బును కూడా ఇచ్చింది. 2019లో థానెలోని యూర్ ఫారెస్ట్ లో కందివాలిలో ప్రధాన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. నిందితులంతా ఆమె దగ్గర నుంచి రూ. 2.1 లక్షలతో పాటు బంగారం తీసుకున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉండే తలసరి అనే ప్రాంతానికి చెందిన మహిళ సెప్టెంబర్ 11న ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులు రవీంద్ర భాటే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్ , గణేష్ కదమ్లను అరెస్టు చేశారు.
అయితే, మహిళపై ఒక్కరే అత్యాచారం చేశారా..? నిందితులు ఐదుగురు ఈ దురాగతానికి ఒడికట్టారా..? అనే విషయాలను కనుగొనాల్సి ఉందని పోలీస్ అధికారి విజయ్ ముతాడక్ తెలిపారు. ఐదుగురిపై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్) 376 (2) (n) (ఒకే మహిళపై పదేపదే అత్యాచారం చేయడం) 420 (మోసం) కింద అభియోగాలు మోపినట్లు పాల్ఘర్ ఎస్పీ బాలాసాహెబ్ పాటిల్ తెలిపారు.
తాజావార్తలు
-
Aishwarya Lekshmi: దళపతి విజయ్ అంటే చాలా ఇష్టం.. కానీ ఓటు వేసే ఛాన్స్ లేదు!
-
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలుడు..ముగ్గురు జవాన్లు మృతి..
-
Bengal Election Results: దీదీ కోటలో కమలం వికసిస్తుందా? ఎగ్జిట్ పోల్స్లో హోరాహోరీ పోరు!
-
Gas Effect: ఇడ్లీ రూ.75, దోశ రూ.80, ఫుల్ మీల్స్ రూ.200.. ‘ఏంది సార్ ఇది.. మేం తినలేం ఇక’
-
Bengal Elections 2026: తృణమూల్ గుండాల అరాచకం.. రీపోలింగ్లో హింస..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!