లోక్సభ ఎన్నికల్లో పేలవమైన పని తీరుకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో ఫడ్నవీస్ ఇంటికి సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అతుల్ లిమాయే పాల్గొన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్లమెంట్లో కాంగ్రెస్కు మరింత బలం చేకూరింది. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్సే ఎక్కువ స్థానాలు గెలిచింది. సొంతంగా 99 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంది. తాజాగా ఆ సంఖ్య 100కు చేరింది.
ఇదిలా ఉంటే ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కూడా దారుణ ఫలితాలను చవి చూసింది. చివరకు బారామతిలో భార్య సునేత్రా పవార్ని కూడా గెలిపించుకోలేకపోయాడు. 05 స్థానాల్లో పోటీ చేసి ఒకే స్థానంలో గెలిచాడు. ఈ పరిణామాల తర్వాత ఈ రోజు ఎన్సీపీ కీలక సమావేశం జరిగింది.
2024 లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే విజయం సాధించారు. ఈ క్రమంలో.. రాష్ట్ర కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే వినూత్నంగా.. నానా పటోలేను లడ్డూలతో తూకం వేశారు కార్యకర్తలు. రాష్ట్రంలో ఇండియా కూటమి అద్భుతమైన పనితీరును సంబరాలు చేసుకుంటున్నారు. కాంటాకు బంతిపూలతో చక్కగా అలంకరించి.. అందులో ఒక పక్కకు నానా పటోల్ ను కూర్చోబెట్టారు. మరో పక్కకు లడ్డూలను పెట్టి తూకం వేశారు. ఇందుకోసం మొత్తం 96 కిలోల లడ్డూలను వినియోగించారు.
Uddhav Thackeray: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ప్రదర్శన చేసింది. కేవలం 09 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మొత్తం 48 సీట్లలో ఎన్డీయే కూటమి 17 స్థానాలకు పరిమితం కాగా, ప్రతిపక్ష ఇండియా కూటమి 30 స్థానాల్లో గెలిచింది.
NCP: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి ఘోరపరాజయం ఆ కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారాయి.ముఖ్యంగా ఎన్సీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. అజిత్ పవార్ ఎన్సీపీ వర్గానికి చెందిన దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు శరద్ పవార్ శిబిరంతో టచ్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత బీజేపీకి సీట్లు తగ్గడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. నిన్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన రాష్ట్రంలో బీజేపీ పని తీరుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు.
Sanjay Raut: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.
Devendra Fadnavis: తాజాగా జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి వరసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.