Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు.
ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ తనపై దాడి చేసిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్పై రాత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Sharad Pawar: రైతుల కష్టాలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీ, ఎన్సీపీ నేత శరద్ పవార్పై విమర్శలు గుప్పించారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత శరద్ పవార్ ప్రధాని మోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేడు ( గురువారం ) మహారాష్ట్రకు వెళ్తున్నారు. ఆయన కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మీ ఆలయాన్ని సందర్శించి అక్కడ.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం షిర్డికి చేరుకోనున్నారు. షిర్డీలో సాయిబాబా దేవాలయాన్ని దర్శి్స్తారని టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి.
ముంబైలోని పూణె నగరంలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి అయినా ఓ యువకుడి భార్య ఇంటికి రాకపోవడంతో పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి ఏడు చోట్ల బాంబులు పేలుస్తానని చెప్పాడు.
మహారాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 ఒమైక్రాన్ సబ్ వేరియెంట్ కేపీ. 2 యొక్క 91 కేసులను గుర్తించింది. ఇది గతంలో ప్రబలంగా ఉన్న జెఎన్. 1 వేరియంట్ కంటే కాస్త ఎక్కువగా ప్రబలుతోంది. ప్రస్తుతం అనేక దేశాలలో కేసులకు ప్రధాన డ్రైవర్ గా ఈ వేరియంట్ ఉంది. పుణెలో అత్యధికంగా కేపీ. 2 కేసులు 51, థానేలో 20 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర మొదట జనవరిలో కేపీ. 2 కేసులను గుర్తించింది. మార్చి, ఏప్రిల్ నాటికి, ఇది ఈ…
మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. బాంరగడ్ తాలుక కత్రన్ గట్ట అటవీప్రాంతంలో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు, ఒక మగ మావోయిస్టు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.