Sanjay Raut: సీఎం యోగిపై ఒత్తిడి తెచ్చేందుకే ఫడ్నవీస్ రాజీనామా డ్రామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఎన్డీయే కూటమిగా 17 సీట్లను గెలుచుకోగా, ఇండియా కూటమి ఏకంగా 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఫలితాలకు తానే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ పదవులకు రాజీనామా చేసి, పార్టీ బలోపేతానికి పనిచేస్తానని చెప్పుకొచ్చారు.
Read Also: Hypersonic Missile: మాస్కోను 30 నిమిషాల్లో తాకే హైపర్ సోనిక్ మిస్సైల్ని పరీక్షించిన యూఎస్..
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Joseph Vijay: టైమ్ టు టైమ్..ఫైల్ తర్వాత ఫైల్.. దళపతి మార్క్ రూలింగ్!
- WhatsApp: మెటాకు కేంద్రం షాక్.. కొత్త ఫీచర్ నిలిపివేయాలని ఆదేశం
- Sanae Takaichi: ఢిల్లీ చేరుకున్న జపాన్ ప్రధాని సనే తకైచి.. 3 రోజులు పర్యటన
అయితే, ఫడ్నవీస్ వ్యాఖ్యలపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) వర్గం నేత సంజయ్ రౌత్ స్పందించారు. అతని రాజీనామా ప్రతిపాదన కేవలం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ఒత్తిడి తీసుకురావడానికే అని జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కొత్త ఎన్డీయే సర్కార్ ఎక్కువ రోజులు నిలవదని జోస్యం చెప్పారు. ‘‘యోగిపై ఒత్తిడి తెచ్చేందుకు ఫడ్నవీస్ రాజీనామా కుట్ర చేస్తున్నాడు. మహారాష్ట్రలో ఫడ్నవీస్ నాయకత్వంలో బీజేపీ ఓడిపోతే, ఉత్తరప్రదేశ్లో యోగి నాయకత్వంలో ఓడిపోయింది. అందుకే ఫడ్నవీస్ రాజీనామా గురించి మాట్లాడుతున్నారు’’ అని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ ఫలితాలకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ దారుణంగా దెబ్బతింది. ఆ రాష్ట్రంలో శివసేన, ఎన్సీపీలో చీలికల ప్రభావం బీజేపీపై పడింది. శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) మంచి ఫలితాలను సాధించాయి. కాంగ్రెస్ 13 సీట్లను గెలుచుకుంది. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్లోని 80 సీట్లలో బీజేపీ కేవలం 33 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఏకంగా 37 సీట్లు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంది. రామ మందిర నిర్మాణం, పటిష్టమైన బీజేపీ బలగం ఉన్నప్పటికీ ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఆశించినంత ఫలితాలను సాధించలేదు. అయోధ్య రామ మందిరం ఉన్న ఫైజాబాద్ లోక్సభ స్థానంలో కూడా బీజేపీ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Iran – Israel: ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ గురి.. ట్రంప్ వార్నింగ్ను నెతన్యాహు బ్రేక్ చేస్తారా?
-
IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
-
Anil Ravipudi : నేటి నుండి వెంకీ – కళ్యాణ్ రామ్ – అనిల్ ఆట షురూ
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!