ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ షాపింగ్ మాల్ మచిలీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. బుధవారం ఉదయం 09:42 గంటలకు గనులు, భూగర్భ శాస్త్ర మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ ఘనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ రావు, మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్, పలువురు నేతలు పాల్గొన్నారు.
ప్రియుడు కోసం ఇద్దరు యువతులు కొట్లాటకు దిగారు. నా వాడంటే నా వాడంటూ జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయ్ అనే బిల్డర్ కోసం కొట్టుకున్నారు ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి.. అనూష అనే ఓ యువతి.
మచిలీపట్నంలో బ్యానర్ విషయంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో.. బ్యానర్ గొడవ తారస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో.. జనసేన కార్యకర్త యర్రంశెట్టి నాని, అతని బావపై టీడీపీ కార్యకర్త దాడి చేశారు. ఈ దాడిలో శాయన శ్రీనివాసరావు గాయపడ్డారు.
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్ఎన్వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
కృష్ణా జిల్లాలో పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపునకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం ఓట్లు, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మచిలీపట్నం పార్లమెంటు, 7 అసెంబ్లీ స్థానాల ఓట్ల లెక్కింపునకు 14 చొప్పున కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ వద్దని.. ఎన్నికల విధుల నుంచి కూడా దూరంగా పెట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే.