Machilipatnam: పేర్ని నాని, కొడాలి నానిపై టీడీపీ కౌంటర్ ఎటాక్.. అంతా మీ వల్లే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Machilipatnam: మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు టీడీపీ, జనసేన నేతలు.. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు టీడీపీ సీనియర్ నేత, కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, మచిలీపట్నం నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ బండి రామకృష్ణ తదితరులు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాడులకు తెగబడే సంస్కృతి పేర్ని నాని, కొడాలి నానిదే అని విమర్శించారు. బందర్లో గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించి దాడులకు పురుకోల్పిందే పేర్ని కిట్టు అనే విషయాన్ని అప్పుడే ప్రజలు మర్చిపోతారా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలపై దాడులకు తెగబడింది ఎవరో మచిలీపట్నంలో ప్రతి ఒక్కరికి తెలుసు..? మండిపడ్డారు.
Read Also: Stock Market: మళ్లీ నష్టాల్లోకి సూచీలు.. దెబ్బతిన్న ఐటీ
Also Read
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Broken Cups Reuse Idea: విరిగిన కప్పులే మీ ఇంటి అందాన్ని పెంచుతాయి.. ఈ ట్రిక్స్ తెలుసా?
ఇక, పేర్ని నాని, కొడాలి నానిలు తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఫైర్ అయ్యారు టీడీపీ, జనసేన నేతలు.. దాడులకు తెగబడే సంస్కృతి మాది కాదు.. మీది అనే విషయాన్ని పేర్ని నాని, కొడాలి నాని గుర్తు పెట్టుకుంటే మంచిదనీ హెచ్చరించారు. గత ఐదేళ్లలో మీరు చేసిన అరాచకాలను మీడియా ముఖంగా బయటపెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా ఏ విధంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అరాచకాలకు, అక్రమాలకు ప్రజలు చెప్పు దెబ్బలాంటి 50వేల మెజారిటీతో సమాధానం చెప్పిన ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని దుయ్యబట్టారు. అంతేకాదు ప్రజా సమస్యలపై పోరాడుతూ.. కరోనాలో సైతం ప్రజలకు సేవ చేస్తుంటే కొల్లు రవీంద్రపై అక్రమ కేసులు పెట్టారో, ఎంత మందిపై దాడులు చేశారో మర్చిపోయారా..!? అని నిలదీశారు. ఓటమిని జీర్ణించుకోలేక వైసీపీ శ్రేణులు అక్కస్సుతో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు.. మా కార్యకర్తలపై దాడులకు పాల్పడటమే గాక తమపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
Read Also: Kalki 2898AD: ట్రైలర్ వస్తోంది సరే.. వైజయంతీ వార్నింగ్ గుర్తుందా?
మరోవైపు.. పోలీసులను తామేదో ఆదేశాలు ఇచ్చినట్టు పేర్ని నాని, కొడాలి నాని మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు టీడీపీ-జనసేన నేతలు.. మేం ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు.. పోలీసులంతా మీరు నియమించిన వాళ్లే ఉన్నారు.. కొంత మంది పోలీసులు ఇప్పటికే మీకే వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కౌంటింగ్ పూర్తయిన మరుక్షణం నుండి మచిలీపట్నంలో 16 మంది టీడీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి.. దాడుల్లో గాయపడ్డ 16 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు… దాడులను ప్రోత్సహించే సంస్కృతి మా నాయకుడు చంద్రబాబు, కొల్లు రవీంద్రది కాదన్న విషయం పేర్ని నాని, కొడాలి నానిలాంటి వ్యక్తులు గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవుపలికారు మచిలీపట్నం టీడీపీ, జనసేన నేతలు.
తాజావార్తలు
-
Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
-
BMW X6 Facelift: భారత్లో BMW X6 ఫేస్లిఫ్ట్ లాంచ్.. 530HP పవర్, జస్ట్ 4.3 సెకన్స్ లో 100kmph స్పీడ్
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
-
Ram Charan : RC 17.. ఓ చిన్న కన్ఫ్యూజన్
ట్రెండింగ్
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!