Vallabhaneni Balashowry: నా వల్ల కాదు అనే వైసీపీకి రాజీనామా చేశా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Balashowry: ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీ వల్లభనేని బాలశౌరి.. జనసేన పార్టీలో చేరారు.. అంతేకాదు.. మరోసారి మచిలీపట్నం లోక్సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు.. అయితే, ఇప్పుడు పార్టీ మాత్రమే మారింది.. జనసేన అభ్యర్థిగా మరోసార తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతున్నారు బాలశౌరి.. ఇక, ఈ రోజు మచిలీపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. అసలు తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో వివరించారు.. నేను వైసీపీ నుంచి జనసేనకు వచ్చాను.. చంద్రబాబును, పవన్ కల్యాణ్ను తిట్టాలని వైసీపీ నాపై ఒత్తిడి తెచ్చింది. నా వల్ల కాదు అని స్పష్టం చేశా.. బందరులో బాగా యాక్షన్ చేసే నేత ఉన్నారు.. అతనికి చెప్పుకోండని చెప్పాను అన్నారు.. ఇక, ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరాను అని గుర్తుచేసుకున్నారు.
Read Also: GT vs DC : 17.3 ఓవర్లకే గుజరాత్ ఆలౌట్.. ఢిల్లీ లక్ష్యం 90..
Also Read
- Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
- Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
- Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
- Droupadi Murmu: కేసుల గుట్టలకు చెక్.. సుప్రీంకోర్టు జడ్జీల పెంపునకు రాష్ట్రపతి ఆమోదం..
ఇక, బందరులో ఓ నేత రెండు చెప్పులు చూపుతూ మాట్లాడతారు.. పవన్ కల్యాణ్ చెప్పులు బందరులో దొరికాయి అంటూ మాజీ మంత్రిపై సెటైర్లు వేశారు బాలశౌరి.. పోర్టు వద్ద ఫొటోలు దిగి తానే పోర్టు కట్టిస్తున్నానని పేర్నినాని చెబుతున్నాడు. పోర్టు తాను తెచ్చానని.. సముద్రం మా తాత తెచ్చాడని పేర్ని నాని చెప్పుకుంటాడని ఎద్దేవా చేశారు. మరోవైపు బీసీ నేత కొల్లు రవీంద్రపై మర్డర్ కేసు పెట్టాడు. నా బీసీ, నా బీసీ అని చెప్పే జగన్.. రేపల్లెలో పెట్రోల్ పోసి తగులపెట్టిన అమర్నాధ్ గౌడ్ హంతకులను ఏం చేశారు.? అని ప్రశ్నించారు. అయితే, తాము అధికారంలోకి రాగానే మచిలీపట్నం నుంచి రేపల్లెకు రైలు మార్గం వచ్చేలా చేస్తాం.. కేంద్రాన్ని ఒప్పిస్తాం అన్నారు. మరోసారి పవన్ కల్యాణ్ పేరును పేర్నినాని ఎత్తకుండా ఉండేలా కూటమి అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చారు మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.
తాజావార్తలు
-
Australia: 61 మంది మహిళలపై పైశాచికత్వం! ఆస్ట్రేలియాలో భారత సంతతి చెందిన వ్యక్తికి 13 ఏళ్ల జైలు శిక్ష
-
Rajnikanth : విజయ్ CM అయినందుకు నాకు ఎలాంటి అసూయ లేదు
-
Story Board: దేశంలో S.I.R ఉద్దేశమేంటి..? జరుగుతున్నదేంటి..?
-
Natural Hair Color: తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ కిచెన్ చిట్కాలతో సహజమైన హెయిర్ కలర్ మీ సొంతం..!
-
MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..