Home
Loksabha Elections 2024
Loksabha Elections 2024 News
-
Rahul Gandhi: త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రాహుల్ గాంధీ..?
రాహుల్ గాంధీ తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. తాను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పారు. కాగా.. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా.. పెళ్లి గురించి ప్రశ్న అడిగారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టత ఇచ్చారు. -
Anna Hazare: “ఈడీ” వెంటపడుతున్న వారిని ఎన్నుకోవద్దు.. కేజ్రీవాల్పై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు
అరవింద్ కేజ్రీవాల్ గురువు, సామాజిక కార్యకర్త అన్నా హజారే ఈరోజు ఆయన శిష్యుడిని టార్గెట్ చేశారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా కలిసి పోరాడిన అన్నా హజారే మద్యం కుంభకోణంపై కేజ్రీవాల్పై విరుచుకుపడ్డారు. ఈరోజు ఓటు వేసిన అనంతరం అన్నా హజారే ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. దేశ రాజకీయాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా.. ప్రతి ఒక్కరూ సరైన అభ్యర్థిని ఎన్నుకోవాలని సూచించారు. తమ వెనుక ఈడీ ఉన్న వారిని ఎప్పుడూ ఎన్నుకోవద్దని అన్నారు. Raghunandan Rao:… -
PM Modi : పశ్చిమ బెంగాల్లో ప్రధాని మోడీ రోడ్షో.. ఊహించని విధంగా ప్రజల స్వాగతం
PM Modi : ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అంటే మే 12న పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. ప్రధాని మోడీ నాలుగు బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లో అకస్మాత్తుగా రోడ్ షో నిర్వహించారు. -
Chirag Paswan: చిరాగ్ పాశ్వాన్కు తప్పిన ముప్పు.. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో ప్రమాదం
బీహార్లోని ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎల్జేపీ (రామ్విలాస్) అధినేత చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో చిరాగ్ పాశ్వాన్కు ఎలాంటి గాయాలు కాలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉజియార్పూర్ లోక్సభ నియోజకవర్గం మొహియుద్దీనగర్లో ఎన్నికల సభలో ప్రసంగించేందుకు వెళ్లిన చిరాగ్ పాశ్వాన్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిప్యాడ్పై నుంచి కిందకు దిగడంతో చక్రాలు భూమిలోకి వెళ్లాయి. -
Patnam Sunita Mahender Reddy: కూకట్పల్లి నియోజకవర్గంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం..
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ నుంచి బేగంపేట్ వరకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర, రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో భారీ మెజారిటీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని పేర్కొన్నారు. -
Sita Reddy: మంచి చేసిన నేతను మళ్ళీ గెలిపించాలి..
ఎన్నికల ప్రచారంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి దూసుకుపోతున్నారు. ఆయనతో పాటు తన సతీమణి సీతారెడ్డి కూడా ప్రచారంలో పాల్గొంటూ.. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఓ సభలో భావోద్వేగమైన ప్రసంగం చేశారు. రంజిత్ రెడ్డిని ఎందుకు మళ్ళీ గెలిపించాలో చెప్పారు. ప్రజాసేవకు ఆయన ఎంత పరితపిస్తారో.. తాను చూశానంటూ వెల్లడించారు. మంచి చేసిన నేతను మళ్ళీ భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. -
Patnam Sunita Mahender Reddy: ప్రచారంలో దూసుకెళ్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి..
మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎల్.బి.నగర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. కొత్తపేట, లింగోజిగూడ డివిజన్లలోని రాజీవ్ గాంధీ నగర్, భరత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, మసీద్ గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధు యాష్కీ గౌడ్, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్… -
Konda Sangeetha Reddy: ప్రజలందరి గుండెల్లో మోడీ నిలిచిపోయారు..
దేశంలోని ప్రతి ఒక్కరి గుండెల్లో నరేంద్ర మోడీ నిలిచిపోయారన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి కొండా సంగీత రెడ్డి. మంగళవారం ఉదయం వికారాబాద్ పట్టణంలోని ఓల్డ్ గంజ్ ప్రాంతంలో తన భర్త గెలుపుని కాంక్షిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా.. కొండా సంగీత రెడ్డి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను వారికి వివరించారు. -
Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగుడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు. -
Konda Visveshwar Reddy: ఆటో డ్రైవర్లను కాంగ్రెస్ విస్మరించింది..
రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆటో డ్రైవర్లను విస్మరించిందని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కోసం ప్రతి నెల జీవన భృతి కల్పిస్తామని చెప్పి మాట తప్పిందని…
తాజావార్తలు
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
-
Murder Case: ‘నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు’.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
-
Chandrababu: ‘అప్పుడు మూడు రాజధానులు.. ఇప్పుడు మావిగన్’.. జగన్పై చంద్రబాబు సెటైర్లు
-
Dulquer Salmaan: ‘ఆపరేషన్ నుమ్ఖోర్’ ఉచ్చులో స్టార్ హీరో.. దుల్కర్ను 4 గంటల పాటు విచారించిన అధికారులు!
-
Vishwambhara : విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?