Ranjith Reddy: చేవెళ్ళ ప్రజలకు సంక్షేమం చేయడమే నా లక్ష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో ప్రతి అర్హుడికి ఆరు గ్యారంటీలకు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు. సోమవారం రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం శివరాంపల్లి, బండ్లగుడ జాగీర్, మణికొండలో ఎంపీ రంజిత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నియోజకవర్గ ఇంఛార్జి కస్తూరి నరేందర్ తదితర నాయకులతో ఆయన ప్రచారం చేశారు.
Yarlagadda Venkata Rao: పేద ప్రజలందరి సొంతింటి కలను నిజం చేస్తాం..
Also Read
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- 5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
తొలుత శివరాంపల్లిలో రంజిత్ రెడ్డి ప్రచారం చేపట్టారు. అనంతరం బండ్లగూడ, మణికొండలో ప్రచారం నిర్వహించారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. చేవెళ్ల వైవిధ్యభరితమైందని చెప్పారు. ఎందుకంటే తమ ప్రాంతం నుంచి హైదరాబాద్ నగరానికి కూరగాయలు, పూవ్వుల నుంచి సాఫ్ట్వేర్ దాకా ఎగుమతి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ మహానగర వంటింట్ల కూరగాయలు, కూరలు తమయేనని.. దేవునింట్ల పూవ్వులు తమవేనని… కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ కూడా మనవేనని నొక్కి చెప్పారు. తాను ఎంత అదృష్టవంతున్ని అయితే ఈ ఇంత గొప్ప నియోజకవర్గానికి ఎంపీని అవుతానని గుర్తు చేశారు.
CM Revanth Reddy : మల్కాజిగిరి ప్రజలను ఓటు అడిగే హక్కు నీకు లేదు..
ఈ అదృష్టం చేవెళ్ళ ప్రజలు ఇచ్చిన అవకాశమని.. అదే అదృష్టం ప్రతి చేవెళ్ళ బిడ్డ కళ్ళల్ల చూసేదాకా తాను ప్రజాక్షేత్రంలో ఉంటానని వివరించారు. చేవెళ్ళ ప్రజలకు అందుబాటులో లేని నాయకుడితో తనకు ఏమాత్రం పోటీ కాదని రంజిత్ రెడ్డి తన రాజకీయ ప్రత్యర్థికి చురకులు అంటించారు. బీజేపీ హయాంలో కేవలం ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమే లబ్ధి పొందినట్టు తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో తాను అభివృద్ధి, అందుబాటు వంటి నినాదాలతో బరిలో నిలిచానని.. ఈ సారి పంచసూత్రాలతో ప్రజల ముందుకు వస్తున్నట్టు వివరించారు. అభివృద్ధి, అందుబాటు, విద్యా, వైద్యం, సంక్షేమం అని చెప్పుకొచ్చారు. సంపద సృష్టించి దాన్ని పేదలకు పంచడమే తన జెండా.. ఎజెండా అని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
-
Green Invicta: గ్రీన్ ఇన్విక్టా ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.45000 డిస్కౌంట్.. చౌక ధరకే సొంతం చేసుకోండి.. 60KM రేంజ్
-
Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
-
5 Best Salads for Glowing Skin: సింపుల్గా తయారుచేసే ఈ 5 సలాడ్లు వాడండి.. మీ చర్మం గులాబీ రంగులో మెరిసిపోతుంది..!
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..