రాజ్యాంగాన్ని ఏ పార్టీ గౌరవిస్తుందో దేశ ప్రజలకు తెలుసు అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. రాజ్యాంగ దినోత్సవ చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అమిత్ షా మాట్లాడారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మరోసారి రాష్ట్ర డీజీపీగా రాజీవ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు మమత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్లో రాజీవ్కుమార్ను మమతాబెనర్జీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది.
Jharkhand Floor Test: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది.
2024 ఎన్నికల పోరులో కాంగ్రెస్ భారీ విజయాన్ని అందుకుంటోంది. గత 10 ఏళ్లలో పార్టీ అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న తరుణంలో అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
అస్సాం జైలు నుంచి పంజాబ్లోని ఖడూర్ సాహిబ్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ ప్రారంభ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ 45,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఆరు వారాల పాటు కొనసాగిన లోక్సభ ఎన్నికల పోలింగ్.. శనివారం ముగిసింది. కాగా.. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుగుణంగా ఉన్నాయి. మూడోసారి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అయితే రేపు (మంగళవారం) నేతల భవితవ్యం బయటపడనుంది. మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు మే 10న సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది.
OpenAI: రేపటితో భారత్లో సార్వత్రిక ఎన్నికలకు తెరపడబోతోంది. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. తాజాగా ఓ బాంబులాంటి వార్త బయటకు వచ్చింది. భారతదేశ ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు, యాంటీ-బీజేపీ ఎజెండాతో కృత్రిమమేథ(AI)ని ఉపయోగించేందుకు ఇజ్రాయిల్కి చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని ఓపెన్ఏఐ(OpenAI) నివేదిక పేర్కొంది.
ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు.
తెలంగాణలో ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్ రాజ్ వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తలేదన్నారు. మధ్యాహ్నం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా వచ్చారని పేర్కొన్నారు.