AP CEO MK Meena: ఎన్ని ఘర్షణలు జరిగినా కట్టడి చేశాం.. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CEO MK Meena: ఏపీలో ఇంకా 3500 పోలింగ్ స్టేషన్లల్లో పోలింగ్ జరుగుతోందని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు. ప్రతి చోటా 100 నుంచి 200 మంది ఉన్నారన్నారు. పది గంటలకల్లా అన్ని చోట్లా పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పోలింగ్ శాతం బాగా పెరిగిందని నమ్ముతున్నామన్నారు. గత ఎన్నికల పోలింగ్ శాతం కంటే ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని.. ఇప్పుడే పోలింగ్ శాతం చెప్పలేమన్నారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 17A స్క్రూట్నీ తర్వాతే రీ-పోలింగ్ విషయంలో నిర్దారిస్తామన్నారు. రీ-పోలింగ్ కోసం ఎలాంటి రిక్వెస్టులు రాలేదన్నారు. తెనాలి, నరసరావు పేట ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశామన్నారు. ఈవీఎం యూనిట్లను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నామని.. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారన్నారు. ఈవీఎం మెషీన్లతో కొన్ని ఇబ్బందులు వచ్చాయని.. సాంకేతిక ఇబ్బందులు గతంతో పోల్చుకుంటే తక్కువగా ఉన్నాయన్నారు.
Read Also: CEO Vikas Raj: భారీ బందోబస్తుతో స్ట్రాంగ్రూమ్స్లో ఈవీఎంలను భద్రపరుస్తాం..
Also Read
వాతావరణం బాగా సహకరించిందని ఆయన వెల్లడించారు. తన దగ్గర కార్డు ఉంది కానీ.. ఓటు లేదనే ఫిర్యాదులు ఎక్కడా కన్పించ లేదన్నారు. బందోబస్తు పెద్ద ఎత్తున పెట్టామన్నారు. సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేశామన్నారు. ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని సీఈవో చెప్పుకొచ్చారు. కొన్ని చోట్ల ఘర్షణలు జరిగినా కట్టడి చేశామన్నారు. పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయని.. పల్నాడులో ఒక చోట ఈవీఎంను ధ్వంసం చేశారు.. ఈవీఎంలోని చిప్లో డేటా భద్రంగా ఉందన్నారు. ఈవీఎంలను మార్చి మళ్లీ పోలింగ్ ప్రారంభించామన్నారు. అన్నమయ్య జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని.. 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారన్నారు. అక్కడ మిషన్లు మార్చి పోలింగ్ పునరుద్ధరించామని చెప్పారు.
Read Also: Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్.. క్యూలైన్లో ఉన్నవారికి ఛాన్స్
పల్నాడు, అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో అదనపు బలగాలు మోహరించాయన్నారు. పీలేరులో ఏజెంట్ల కిడ్నాప్ ఘటన జరిగినా.. వెంటనే సమస్య పరిష్కరించామన్నారు. పల్నాడులో 12 ఘటనలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.మాచర్ల పరిధిలో 8 ఈవీఎం మెషీన్లని ధ్వంసం చేశారని.. కానీ డేటా ఎక్కడికీ పోలేదన్నారు. పోలింగ్ కొద్దిసేపు అంతరాయం కలిగింది.. ఆ తర్వాత పోలింగ్ ప్రారంభించామని చెప్పారు. హింసాత్మక ఘటనలు జరిగినా.. మెషీన్ల డామేజ్ జరిగినా పోలింగ్ నిర్వహించగలిగామన్నారు. ఎక్కడా రీ-పోలింగ్ అవసరం లేదన్నారు. తెనాలి, అనంతపురంలలో లీడర్లను హౌస్ అరెస్ట్ చేశామని ఏపీ సీఈవో ఎంకే మీనా వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!