Radical Preacher Amritpal Singh: అస్సాం జైలు నుంచి పంజాబ్లోని ఖడూర్ సాహిబ్లో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాడికల్ బోధకుడు అమృతపాల్ సింగ్ ప్రారంభ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం, కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై స్వతంత్ర అభ్యర్థి అమృతపాల్ సింగ్ 45,424 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. వారిస్ పంజాబ్ డి చీఫ్, అమృతపాల్ సింగ్ గత సంవత్సరం జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపబడి అస్సాంలోని దిబ్రూఘర్ జైలులో ఉన్నారు. తన మద్దతుదారుల్లో ఒకరిని అరెస్టు చేసినందుకు గత ఏడాది ఫిబ్రవరిలో ఒక గుంపు పోలీసు స్టేషన్పై దాడి చేసిన తర్వాత వార్తల్లో నిలిచాడు. అమృతపాల్ సింగ్ భారీ అణిచివేత తర్వాత అరెస్టు చేయబడిన సంగతి తెలిసిందే. NSA కింద అభియోగాలు మోపబడి, దిబ్రూగఢ్ జైలుకు తరలించారు.
Read Also: Lok Sabha Election 2024 Results: 100 మార్క్ని తాకిన కాంగ్రెస్.. 2014 తర్వాత అతిపెద్ద విజయం..
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జస్బీర్ సింగ్ గిల్ ఖడూర్ సాహిబ్ స్థానంలో గెలుపొందారు. అమృతపాల్ సింగ్, కుల్బీర్ సింగ్ జీరాలతో పాటు అకాలీదళ్కు చెందిన విర్సా సింగ్ వాల్తోహా, ఆప్ నుంచి లాల్జిత్ సింగ్ భుల్లర్ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం ఆప్ మూడో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ నాలుగో స్థానంలో ఉంది.