OpenAI: భారత ఎన్నికల్ని ఏఐతో ప్రభావితం చేసే కుట్ర.. యాంటీ-బీజేపీ ఎజెండాతో ఇజ్రాయిల్ సంస్థ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OpenAI: రేపటితో భారత్లో సార్వత్రిక ఎన్నికలకు తెరపడబోతోంది. మరో నాలుగు రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. తాజాగా ఓ బాంబులాంటి వార్త బయటకు వచ్చింది. భారతదేశ ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు, యాంటీ-బీజేపీ ఎజెండాతో కృత్రిమమేథ(AI)ని ఉపయోగించేందుకు ఇజ్రాయిల్కి చెందిన ఓ సంస్థ ప్రయత్నించిందని ఓపెన్ఏఐ(OpenAI) నివేదిక పేర్కొంది. ఈ కోవర్ట్ ఆపరేషన్ని అడ్డుకున్నట్లు ఓపెన్ఏఐ వెల్లడించింది. ఇజ్రాయిల్ ఆధారిత నెట్వర్క్ ‘‘భారతదేశం దృష్టిసారించే వ్యాఖ్యల్ని సృష్టించడం ప్రారంభించిందని, అధికార బిజెపి పార్టీని విమర్శించింది మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసించింది’’ అని నివేదిక పేర్కొంది.
READ ALSO: Bhavani Revanna: హెచ్డీ రేవణ్ణ భార్యకు లభించని ఊరట.. కిడ్నాప్ కేసులో నో బెయిల్
Also Read
- Sachin Tendulkar: "ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
- Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- PM Modi Paper Leak Law: పేపర్ లీక్లపై కఠిన చట్టాలకు సిద్ధమైన కేంద్రం.. అర్ధరాత్రి ప్రధాని మోడీ వీడియో సందేశం
- Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్చుక్
ఈ నెట్వర్క్ ఇజ్రాయెల్లోని రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ STOIC ద్వారా నిర్వహించబడుతుందని నివేదిక పేర్కొంది. ప్రజాభిప్రాయాలను మార్చేందుకు లేదా రాజకీయ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించే కార్యకలాపాల కోసం AIని ఉపయోగించిందని నివేదిక వెల్లడించింది. రహస్య కార్యకలాపాల కోసం కంటెంట్ను రూపొందించడానికి మరియు సవరించడానికి ఇజ్రాయెల్ నుండి నిర్వహించబడుతున్న ఖాతాల క్లస్టర్ ఉపయోగించబడిందని తెలిపింది. ఈ కంటెంట్ ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వెబ్సైట్స్, యూట్యూబ్కి షేర్ చేయబడింది. మే ప్రారంభంలో ఈ నెట్వర్క్ ఇంగ్లీష్ కంటెంట్తో ఇండియా ప్రజల్ని లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించినట్లు నివేదిక వెల్లడించింది.
ఈ నివేదికపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..‘‘ కొన్ని భారతీయ రాజకీయ పార్టీల తరుపున తప్పుడు సమాచారం, విదేశీ జోక్యం జరిగింది. వీరికి బీజేపీ లక్ష్యంగా ఉందనేది స్పష్టమైంది’’ అని అన్నారు. భారతదేశం వెలుపల ఉన్న స్వార్థ ప్రయోజనాలే దీనిని నడిపిస్తున్నాయని, దీనిపై లోతుగా పరిశోధన చేయడం అవసరమని అన్నారు.
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!