భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న మాజీ డిప్యూటీ సీఎం
కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడులో టీడీపీ కార్యకర్తలతో మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూ… కేఈ కృష్ణమూర్తి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. వైసీపీ ప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని… పగతో రగిలిపోతోందని కేఈ కృష్ణమూర్తి మండిపడ్డారు. అయితే తమపై వైసీపీ ఎంత కసి పెంచుకున్నా.. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే అని కేఈ స్పష్టం చేశారు.
Read Also: 10 రూపాయల కోడి పిల్లకి.. రూ.50 టికెట్.. ఎక్కడంటే?
ఏపీలో వైసీపీ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని కేఈ అభిప్రాయపడ్డారు. గతంలో దేశంలో ఇందిరాగాంధీ గాలి వీచినప్పుడే తాను గెలిచానని కేఈ కృష్ణమూర్తి గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తల కోరిక మేరకు కంబాలపాడుకు టీడీపీ అధినేత చంద్రబాబును తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్వగ్రామం కంబాలపాడుకు వచ్చిన కేఈ కృష్ణమూర్తికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
తాజావార్తలు
-
GT vs KKR: విక్టరీ కోసం కోల్కతా పోరు.. బ్యాటింగ్ ఎవరిదంటే?
-
Sachin Tendulkar: నా కెరీర్లో చూసిన బెస్ట్ క్యాచ్ అదే: సచిన్ టెండూల్కర్
-
Chanakya Niti: దరిద్రం దరిచేరకుండా.. అదృష్టం మీ తలుపు తట్టాలంటే ఇలా చేయండి! ఆచార్య చాణక్యుడి గోల్డెన్ టిప్స్
-
Strait Of Hormuz: ప్రపంచానికి ఇరాన్ శుభవార్త..
-
Pakistan: ‘‘డీలిమిటేషన్ బిల్లు’’పై పాకిస్తాన్ అభ్యంతరం.. ఘాటుగా స్పందించిన భారత్..
ట్రెండింగ్
-
Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!
-
Health Tips : వర్కౌట్ బట్టల్లో ప్రాణాంతక రసాయనాలు.. ఫిట్నెస్ కోసం వెళ్తే అనారోగ్యం ఫ్రీ.!
-
Train Ticket Rules: రైలు ప్రయాణికుల టెన్షన్కు ఇక సెలవు.. అమల్లోకి కొత్త చార్ట్ రూల్స్.!
-
How to choose Good Mango: రంగు కాదు.. రుచి ముఖ్యం.! పర్ఫెక్ట్ ‘మామిడి పండు’ని ఇలా సెలెక్ట్ చేసుకోండి..
-
8000mAh భారీ బ్యాటరీ, డ్యూయల్ 200MP కెమెరాలతో రాబోతున్న కొత్త ఫ్లాగ్షిప్ Oppo Find X10 సిరీస్..!