తెలంగాణ టీఆర్ఎస్ కేంద్రంపై యుద్ధం ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఆందోళన కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ కోసం గతంలో ఉద్యమంలా ఎలా వచ్చారో, ఇప్పుడు కూడా రైతుల కోసం అలాగే వచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. నేడు రైతుల పోరాటం న్యాయమైన పోరాటమని, ఈ పోరాటంలో రైతులు గెలుస్తారు అని ఆయన జోస్యం చెప్పారు.…
ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం తీరును నిరసిస్తూ నేడు టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపత్యంలో వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులంతా సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు, కరెంట్, రైతు బంధు ఇచ్చాము.. వడ్లు కొనలేమని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. యాసంగి వడ్లు కొనకుండా కేంద్రం నటకాలాడుతోందని, రైతులను వరి వేయండి,…
గుబురుగా నల్లని గడ్డం పెంచి, తెల్లని పంచె కట్టి యంగ్ హీరో నాని “లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ జర్నీ…” అంటున్నాడు. అరె… డైలాగ్ బాగుందే… గెటప్ అదిరిందే! ఏ సినిమాలోదో? అనుకుంటే పొరబాటే! ‘మినిస్టర్ వైట్’ బ్రాండ్ కు నాని బ్రాండ్ అంబాసిడర్ గా అలా కనిపిస్తున్నారన్న మాట! లుంగీలు, పంచెలు, షర్ట్స్ ఉత్పాదనలో ‘మినిస్టర్ వైట్’ సాగుతోంది. ఈ బ్రాండ్ తో నాని కూడా పయనం సాగిస్తున్నారు. అందుకే ‘జీవితం అందమైన ప్రయాణం లాంటిది’…
ఇటీవల జరిగిన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజున సీఎం కేసీఆర్ త్వరలోనే 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ పోలీస్ శాఖలో కూడా ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ అధికారులు త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని, పోలీస్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలో నేడు పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్…
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మంగళవారం కలిసారు. ఈ సందర్భంగా రామగిరి కోటను పరిరక్షించాలని శ్రీధర్బాబు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి వినతిప్రతం అందజేశారు. 12వ శతాబ్దానికి చెందిన కోటకు సరైన రహదారి, ఇతర మౌళిక వసతులను కల్పించాలని ఆయన కోరారు. మంథని నియోజకవర్గంలోని రామగిరి కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆయన కిషన్రెడ్డికి విన్నవించారు. సాంస్కృతిక వారసత్వం, ఔషధ మొక్కల కేంద్రంగా రామగిరి కోట ఉందని కేంద్రమంత్రికి శ్రీధర్బాబు తెలిపారు.…
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఈ రోజు దళిత బంధు ప్రారంభమైంది. మండలంలోని బడ్డాయిపల్లి గ్రామంలోని దళితులకు దళిత బంధు ద్వారా వచ్చిన ట్రాక్టర్ లను జేసీబీలను బొలెరో వాహనాన్ని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అందజేశారు. అలాగే 20 మంది లబ్ధిదారులకు డైరీ కి సంబంధించి ప్రొసిడింగ్స్ ను కూడా సందర్భంగా అందజేశారు. మర్పల్లి మార్కెట్ యాడ్ లో వైభవంగా జరిగిన దళిత బంధు వాహనాల పంపిణీలో లబ్ధిదారుల తో పాటు నియోజకవర్గంలోని నాయకులు కూడా…
వేసవి తాపం అప్పుడే మొదలైంది. వేసవికాలం పూర్తిగా ప్రారంభం కాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో వేసవికాలంలో ఎదుర్కొనే నీటి ఎద్దడిని తప్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. అనుకున్న దాటి కంటే వేడి తీవ్రత అధికంగా ఉండటంతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలెవ్వరూ నీటికి ఇబ్బంది పడకుండ ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ వేసవిలో తాగునీటి సరాఫరాపై ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో…
భారత్పై దుష్ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ ఛానెల్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ప్రత్యేక ఉత్తర్వుల్లో, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ 22 ఛానెళ్లపై ఈ చర్యలు తీసుకోవాలని యూట్యూబ్ను ఆదేశించింది. భారత్పై దుష్ప్రచారం చేస్తున్న 22 యూట్యూబ్ చానళ్లపై ప్రభుత్వం నిషేధం విధించింది. కేంద్రం బ్యాన్ చేసిన వాటిలో 4 పాకిస్థాన్కు యూట్యూబ్ చానళ్లు ఉన్నట్లు…
హైదరాబాద్లో డ్రగ్స్కు బానిసై బీటెక్ విద్యార్థి మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ దర్యాప్తును వేగవంతం చేసింది. ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న డ్రగ్స్ పెడ్లర్ లక్ష్మీపతి ఆచూకీ కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీపతిని హెచ్ న్యూ వింగ్ అదుపులోకి తీసుకుంది. అయితే హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఎట్టకేలకు లక్ష్మీపతి ఏపీలో పోలీసులు…
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం దళిత బంధు. అయితే నేడు గజ్వేల్ నియోజకవర్గంలోని కొల్గూరు గ్రామంలో 129 మందికి దళిత బంధు లబ్దిదారులకు మంత్రి హరీష్ రావు మంజూరు పత్రాలు, యూనిట్లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు పథకం క్రింద ఒక్కొ లబ్దిదారుడికి రూ.10 లక్షలు అందజేసిన ఘటన సీఎం కేసీఆర్కే దక్కుంతుందని ఆయన కొనియాడారు. అంతేకాకుండా దళితులు వ్యాపార వృద్ధి సాధించి, అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలవాలన్నారు. పార్టీలకు అతీతంగా…