హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ… బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్ బాగ్ లోని శ్రీ సిద్ది వినాయక్ జెవెల్లెర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ప్రేవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇంచార్జ్ గా పని చేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీ కు రాకుండా , ఫోన్ చేసిన…
రాజన్న సిరిసిల్ల పట్టణంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో శ్రీ చండీ యాగంలో కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్ని లక్షల మంది రైతులు తీసుకున్న రుణమాఫీ 40 వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తాం అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 26 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి 16 వేల కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. రేవంత్ రెడ్డి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి…
రాజన్న సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ బైపాస్ రోడ్డులో సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహనికి పూల మాల వేసి నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొరకు పాటుపడిన మహానుభావుడు పాపన్న గౌడ్ అని ఆయన కొనియాడారు. భారత దేశానికి స్వాతంత్రం, తెలంగాణలో ఉన్న నిరంకుశ పాలనకు చరమగీతం పాడింది పాపన్ననే అని ఆయన వ్యాఖ్యానించారు. సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలన్న సంకల్పంతో…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నేడు పర్యటించారు. ఈ సందర్భంగా పరకాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానగా ముఖ్యమైన అంశాలు విశ్లేషించుకున్నామని, పరకాలకు సంబంధించిన విషయంపై హైదరాబాదులో మాట్లాడనున్నామన్నారు. టెక్స్ టైల్ పార్క్ ఈ ప్రాంత ప్రజలు ఎంతో ఉపయోగ పడుతుందని, టెక్స్ టైల్ పార్క్ విషయంలో గత ప్రభుత్వాలు మాటలకే పరిమితం చేసిందన్నారు మంత్రి పొంగులేటి. గతంలో వరంగల్…
కామారెడ్డి క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ సన్మాన సభ. ఈ సభలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు. ఎంపీగా మొదటిసారి కామారెడ్డికి వచ్చిన సురేష్ షెట్కార్ను షబ్బీర్ అలీ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ఆడవాళ్ళకు బ్రేక్ డాన్స్ చేయిస్తా అన్న వారికి బుద్ధి చెబుతామన్నారు. మా అక్క చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోమని ఆయన వ్యాఖ్యానించారు. 200 యూనిట్స్ కరెంటు కొన్ని…
ఉప్పల్ శిల్పారామంలో రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే.. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. నన్ను రక్షించు అని చెబుతూ సోదరుడికి రాఖీ కడుతుంది సోదరి అని, దేశాన్ని రక్షించడానికి సోదరులంతా రక్షగా ఉండాలన్నారు. పది రోజుల యుద్ధంలో రావణుడిని రాముడు చంపేశాడని, లంకలోకి లక్ష్మణుడు వెళ్లినప్పుడు మన భూమి…
కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్దకు చేరింది. ఆర్మీ కాలేజీకి చెందిన వైద్యుడి పిటిషన్తో సహా మూడు లేఖ పిటిషన్లు సీజేఐకి పంపబడ్డాయి. ఈ భయంకరమైన ఘటనపై సీజేఐ స్వయంచాలకంగా స్పందించి, త్వరితగతిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఆగస్టు 17న దేశవ్యాప్తంగా అన్ని చిన్నా, పెద్దా ఆసుపత్రులను మూసివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. 24 గంటల పాటు వైద్యులు సమ్మె చేయనున్నారు. ఈ విషయాన్ని ఐఎంఏ జాతీయ అధ్యక్షుడు ఆర్వీ అశోకన్ తెలిపారు. శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమయ్యే సమ్మె మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
పాకిస్థాన్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు దేశంలో అమ్మాయిల పెళ్లిళ్ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నవయస్సులోనే అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం, నగదు కొరత ఉన్న పాకిస్తానీ తల్లిదండ్రులు డబ్బుకు బదులుగా తమ తక్కువ వయస్సు గల కుమార్తెలను వివాహం కోసం వ్యాపారం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ రైల్వేస్టేషన్కు సమీపంలో సబర్మతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.