PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఢిల్లీ-మీరట్ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణాన్ని అత్యంత వేగవంతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు నమో భారత్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మీరట్లో రూ. 12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఢిల్లీ నుండి మీరట్ మధ్య దూరం సుమారు 82 కిలోమీటర్లు. గతంలో ఈ దూరం ప్రయాణించడానికి 3 నుండి 3.5 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ కారిడార్ వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. నమో భారత్ (RRTS) గంటకు 180 కి.మీ డిజైన్ వేగంతో నడిచే ఈ రైలు దేశంలోనే మొదటి రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్ మరియు మీరట్ వంటి పట్టణాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానిస్తుంది. అలాగే మీరట్ మెట్రో రైలు గంటకు 120 కి.మీ ఆపరేషనల్ వేగంతో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలుస్తుంది.
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి మీరట్లోని మోదీపురం, బేగంపూర్ లేదా శతాబ్ది నగర్ వంటి ప్రాంతాలకు కేవలం ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఢిల్లీలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో, ఉద్యోగులు మీరట్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్లను అద్దెకు తీసుకుని మెట్రో ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల ప్రయాణ సమయం తగ్గి, ఉద్యోగులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. ఇంకా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఢిల్లీ-మీరట్ మధ్య రోజూవారీ ప్రయాణాన్ని శ్రమ లేకుండా ఇంకా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
#WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi flags off Meerut Metro and Namo Bharat Train at Shatabdi Nagar Namo Bharat Station.
From here, PM Modi will undertake a Metro Ride till Meerut South Station. Later, the Prime Minister will inaugurate and dedicate to… pic.twitter.com/uYw8pxetwD
— ANI (@ANI) February 22, 2026
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?