PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఢిల్లీ-మీరట్ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణాన్ని అత్యంత వేగవంతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు నమో భారత్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మీరట్లో రూ. 12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్పింగ్ భేటీలో కీలకాంశాలు..
ఢిల్లీ నుండి మీరట్ మధ్య దూరం సుమారు 82 కిలోమీటర్లు. గతంలో ఈ దూరం ప్రయాణించడానికి 3 నుండి 3.5 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ కారిడార్ వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. నమో భారత్ (RRTS) గంటకు 180 కి.మీ డిజైన్ వేగంతో నడిచే ఈ రైలు దేశంలోనే మొదటి రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్ మరియు మీరట్ వంటి పట్టణాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానిస్తుంది. అలాగే మీరట్ మెట్రో రైలు గంటకు 120 కి.మీ ఆపరేషనల్ వేగంతో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలుస్తుంది.
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి మీరట్లోని మోదీపురం, బేగంపూర్ లేదా శతాబ్ది నగర్ వంటి ప్రాంతాలకు కేవలం ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఢిల్లీలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో, ఉద్యోగులు మీరట్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్లను అద్దెకు తీసుకుని మెట్రో ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల ప్రయాణ సమయం తగ్గి, ఉద్యోగులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. ఇంకా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఢిల్లీ-మీరట్ మధ్య రోజూవారీ ప్రయాణాన్ని శ్రమ లేకుండా ఇంకా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
#WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi flags off Meerut Metro and Namo Bharat Train at Shatabdi Nagar Namo Bharat Station.
From here, PM Modi will undertake a Metro Ride till Meerut South Station. Later, the Prime Minister will inaugurate and dedicate to… pic.twitter.com/uYw8pxetwD
— ANI (@ANI) February 22, 2026
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!