PM Narendra Modi: ‘నమో భారత్’, ‘మీరట్ మెట్రో’లను ప్రారంభించిన ప్రధాని మోడీ.. ప్రజలతో కలిసి ప్రయాణం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా ఢిల్లీ-మీరట్ ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చివేసే సరికొత్త ప్రాజెక్టులను ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణాన్ని అత్యంత వేగవంతం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేడు నమో భారత్, మీరట్ మెట్రో సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీరట్ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో ప్రయాణించి ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం మీరట్లో రూ. 12,930 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు.
Ragi Omelette Recipe: ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్.. హై-ప్రోటీన్ ‘రాగి ఆమ్లెట్’!
Also Read
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
- Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ఢిల్లీ నుండి మీరట్ మధ్య దూరం సుమారు 82 కిలోమీటర్లు. గతంలో ఈ దూరం ప్రయాణించడానికి 3 నుండి 3.5 గంటల సమయం పట్టేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ కారిడార్ వల్ల ఈ సమయం గణనీయంగా తగ్గనుంది. నమో భారత్ (RRTS) గంటకు 180 కి.మీ డిజైన్ వేగంతో నడిచే ఈ రైలు దేశంలోనే మొదటి రీజనల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్. ఇది సాహిబాబాద్, ఘజియాబాద్, మోదీనగర్ మరియు మీరట్ వంటి పట్టణాలను ఢిల్లీతో వేగంగా అనుసంధానిస్తుంది. అలాగే మీరట్ మెట్రో రైలు గంటకు 120 కి.మీ ఆపరేషనల్ వేగంతో ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా నిలుస్తుంది.
Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!
ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుండి మీరట్లోని మోదీపురం, బేగంపూర్ లేదా శతాబ్ది నగర్ వంటి ప్రాంతాలకు కేవలం ఒక గంటలోనే చేరుకోవచ్చు. ఢిల్లీలో ఇంటి అద్దెలు ఎక్కువగా ఉండటంతో, ఉద్యోగులు మీరట్ వంటి ప్రాంతాల్లో తక్కువ ధరకే ఇళ్లను అద్దెకు తీసుకుని మెట్రో ద్వారా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. వేగవంతమైన కనెక్టివిటీ వల్ల ప్రయాణ సమయం తగ్గి, ఉద్యోగులు తమ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి వీలవుతుంది. ఇంకా విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఢిల్లీ-మీరట్ మధ్య రోజూవారీ ప్రయాణాన్ని శ్రమ లేకుండా ఇంకా తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చు.
#WATCH | Meerut, Uttar Pradesh: Prime Minister Narendra Modi flags off Meerut Metro and Namo Bharat Train at Shatabdi Nagar Namo Bharat Station.
From here, PM Modi will undertake a Metro Ride till Meerut South Station. Later, the Prime Minister will inaugurate and dedicate to… pic.twitter.com/uYw8pxetwD
— ANI (@ANI) February 22, 2026
తాజావార్తలు
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!