టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో పెరుగుతున్న పోలీసుల ఉదాసీనతను విమర్శిస్తూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళనకు దిగారు. చట్టాన్ని అమలు చేయకపోవడం, పెరుగుతున్న వేధింపులు మరియు రాజకీయ పూజలను సూచించే వివిధ సంఘటనలను ఆయన ఉదహరించారు. ట్విట్టర్ వేదికగా ఇటీవల నిజామాబాద్లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు కేటీఆర్. అక్కడ ఒక స్వీట్ షాప్ యజమాని “పోలీసుల వేధింపుల కారణంగా దుకాణం మూసివేయబడింది” అని పేర్కొంటూ దాని ముందు భారీ బ్యానర్ను…
పంట రుణాలు మాఫీ కాని రైతుల నుంచి మంగళవారం వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించగా, అందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతూ రైతులు వివిధ చోట్ల బైఠాయించారు. వేంసూరు మండల ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. అదేవిధంగా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రైతు వేదిక వద్ద రైతులు నిరసన చేపట్టారు. రైతులకు మద్దతు తెలుపుతూ అఖిల…
సచివాలయంలో జలాశయాల పూడిక తీత పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. చైర్మన్, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటి పారుదల, రెవిన్యూ, ఖనిజాభివృద్ది శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో నీటి పారుదల జలాశయాలలో పూడిక తీత పనులను పకడ్బందీ ప్రణాలికతో…
ఏపీ చిన్నతరహా పరిశ్రమల శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డ్వాక్రా మహిళల ద్వారా చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయించే అంశంపై చర్చించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికల సిద్ధం చేస్తోంది.
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం రాంపూర్ గ్రామంలో సరస్వతి విద్యా మందిర్ నూతన భవన నిర్మాణానికి కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. దేశ పరిణామాలపై అవగాహన లేకపోతే విచ్చిన్నమయ్యే ప్రమాదం ఉంది.. బంగ్లాదేశ్ లో సంక్షోభమే నిదర్శనమన్నారు. దేశభక్తి, ధర్మాన్ని బోధించడంతోపాటు దేశ పరిణామాలపై చర్చలో శిశు మందిర్ భేష్ అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ విద్యా వ్యవస్థలో నక్సల్ భావజాలం…
సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరంలో తాగుబోతు 108 సిబ్బందికి చుక్కలు చూపించాడు. తీవ్ర జ్వరం వచ్చిందని, హాస్పిటల్ కి వెళ్లాలని 108కు ఫోన్ చేశాడు పరుశరాములు. చెప్పిన అడ్రస్ కు వచ్చిన 108 సిబ్బంది.. రాగానే ఫోన్ చేయగా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఆందోళనకు గురయ్యారు 108 సిబ్బంది. 108 సిబ్బంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ కట్ చేయడంతో బాధితుడి కోసం ఆరా తీశారు 108 సిబ్బంది. ఫోన్ చేసిన సదర్ కాలర్ ను…
రాఖీ పండుగ రోజు కూడా మహిళా మంత్రిని, మహిళా కమిషన్ చైర్పర్సన్ ను నిందించడం కేటీఆర్ కే చెల్లిందని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. పండగపూట రాజకీయ లబ్ధి కోసం కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని, మహిళా భద్రతకి మేము పెద్ద పీట వేస్తున్నామన్నారు. నేరాలకు కారణం అవుతున్న డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై ఉక్కు పాదం మోపామని, ఎనిమిది నెలల తర్వాత మహిళలపై అఘాయిత్యాలు మాకు గుర్తుకువచ్చాయని కేటీఆర్ చెప్పడం ఆయన అజ్ఞానానికి అద్దం…