హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్ మాట్లాడుతూ… బషీర్ బాగ్ చంద్ర నగర్ కు చెందిన మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్ బాగ్ లోని శ్రీ సిద్ది వినాయక్ జెవెల్లెర్స్ అండ్ ఎక్స్ పోర్ట్స్ ప్రేవేట్ లిమిటెడ్ లో స్టాక్ ఇంచార్జ్ గా పని చేస్తున్నాడు. గత రెండు నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీ కు రాకుండా , ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో … సదరు యజమానికి అనుమానం వచ్చి , ఆడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు.
CM Chandrababu: రేపు సోమశిల జలాశయాన్ని పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
దీనితో అనుమానం వచ్చిన యజమాని నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు తో కేసు నమోదు చేసుకొని , సాయి లక్ష్మణ్ ను అదుపులోకి తీసుకొని , తమదైన శైలిలో విచారించారు. దీనితో తానే దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడించాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమెండ్ నక్లెస్ దొంగిలించి మనప్పురం గోల్డ్ లో తాకట్టు పెట్టినట్లు తెలిపాడు. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ , తన లవర్ తో దేవస్థానాలు తిరిగినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి మూడు తులాల బంగారం తో పాటు మనప్పురం లో తాకట్టు పెట్టిన డైమాండ్ నక్లెస్ ను రికవరీ చేసినట్లు ఏసీపీ తెలిపారు.
Kolkata doctor case: కోల్కతా డాక్టర్ కేసులో అనేక అనుమానాలు.. ఘటన వెనక డ్రగ్స్ రాకెట్..?