Jodhpur Sisters: తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే ఆ*త్మహ*త్య చేసుకున్న అక్కాచెల్లెళ్ళు
- 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు
- తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య
- జోధ్పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణ ఘటన జరిగింది. 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 22, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది. శోభ (25), విమల (23) ఇద్దరూ దీప్ సింగ్ కుమార్తెలు. జోధ్పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు. ఇద్దరు సోదరీమణులకు ఒకే రోజు (శనివారం) డబుల్ వెడ్డింగ్ జరగనుండగా, శుక్రవారం రాత్రి బండోలి (బంధన్) వేడుకలు పూర్తయ్యాయి.
Also Read:Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!
Also Read
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
- Simhachalam Temple Land: సింహాచలం భూముల వివాదంపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నోటీసులు
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
అయితే, శనివారం ఉదయం 4 గంటల సమయంలో వారి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే సమయానికి ఇద్దరినీ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వారు విషపదార్థం (పురుగుల మందు లేదా ఇతర విషం) సేవించినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యే అని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.
Also Read:Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వివాహాల కోసం ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబం, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది కుటుంబ ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నాచురల్ డెత్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లో సంచలనం రేపింది. మరిన్ని వివరాలు పోస్ట్మార్టం, పోలీస్ దర్యాప్తు తర్వాత వెల్లడికానున్నాయి. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అత్తవారింట్లో భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతారని భావించిన తల్లిదండ్రులు తమ కూతుర్లు విగతజీవులు కావడంతో గుండెలవిసేలా రోదించారు.
తాజావార్తలు
-
Russian Couple: ప్రేమ కోసం ప్రాణాలనే పణంగా పెట్టిన జంట.. 1,454 అడుగుల ఎత్తులో ప్రపోజ్!
-
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
-
Durefishan Saleem: పాక్ నటి డేటింగ్ రూమర్స్.. యూట్యూబర్తో పెళ్లి వార్తలపై మేకప్ ఆర్టిస్ట్ షాకింగ్ రియాక్షన్
-
India – Pakistan: భారత్ – పాక్ మధ్య అర్ధరాత్రి ఆసక్తికర ఒప్పందం.. ఏంటో తెలుసా!
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!