Jodhpur Sisters: తెల్లవారితే పెళ్లి.. ఇంతలోనే ఆ*త్మహ*త్య చేసుకున్న అక్కాచెల్లెళ్ళు
- 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు
- తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య
- జోధ్పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్లోని జోధ్పూర్లో దారుణ ఘటన జరిగింది. 25 ఏళ్లు, 23 ఏళ్ల వయస్సు గల ఇద్దరు అక్కాచెల్లెళ్ళు తమ వివాహం జరిగే రోజున ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శనివారం (ఫిబ్రవరి 22, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది. శోభ (25), విమల (23) ఇద్దరూ దీప్ సింగ్ కుమార్తెలు. జోధ్పూర్ జిల్లాలోని మనై గ్రామానికి చెందినవారు. ఇద్దరు సోదరీమణులకు ఒకే రోజు (శనివారం) డబుల్ వెడ్డింగ్ జరగనుండగా, శుక్రవారం రాత్రి బండోలి (బంధన్) వేడుకలు పూర్తయ్యాయి.
Also Read:Jai Hanuman : అంజనాద్రి సాక్షిగా ‘జై హనుమాన్’ షురూ.. హనుమంతుడిగా రిషబ్ శెట్టి ఎంట్రీ..!
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అయితే, శనివారం ఉదయం 4 గంటల సమయంలో వారి ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అక్కడికి చేరుకునే సమయానికి ఇద్దరినీ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, వారు విషపదార్థం (పురుగుల మందు లేదా ఇతర విషం) సేవించినట్లు అనుమానిస్తున్నారు. ఆత్మహత్యే అని పోలీసులు భావిస్తున్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి.
Also Read:Varanasi : లీక్ అయిన.. మహేష్ బాబు ‘వారణాసి’ రాముడి పోస్టర్ నిజమేనా..?
ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. వివాహాల కోసం ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరుగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. కుటుంబం, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది కుటుంబ ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల జరిగిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్నాచురల్ డెత్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన రాజస్థాన్లో సంచలనం రేపింది. మరిన్ని వివరాలు పోస్ట్మార్టం, పోలీస్ దర్యాప్తు తర్వాత వెల్లడికానున్నాయి. పెళ్లి భాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అత్తవారింట్లో భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతారని భావించిన తల్లిదండ్రులు తమ కూతుర్లు విగతజీవులు కావడంతో గుండెలవిసేలా రోదించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!