ప్రజలపై భారం మోపకుండ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుదామని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రెవెన్యూ, గృహ నిర్మాణం, ఐ అండ్ పిఆర్, ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్తులు సృష్టించి, సృష్టించిన ఆస్తులతో వచ్చిన ఆదాయం…
రాష్ట్రంలోని 50 ఐటీఐలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల (స్కిల్లింగ్ సెంటర్లు) ఏర్పాటుకు టాటా గ్రూప్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. వీటిలో కొత్త కోర్సులు, మాస్టర్ ట్రైనర్ల నియామకానికి రూ.1500 కోట్ల పెట్టబడులు పెట్టనుంది. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో విస్తరించిన టాటా గ్రూప్ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై చర్చించారు. ఐటీ…
నా వెంట్రుక ముక్క కూడా చంద్రబాబు పీకలేరు అని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఉడత ఊపులకు భయపడను.. చంద్రబాబు ఎంతటి మోసగాడో అందరికీ చెబుతూనే ఉంటాను.. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు.. బూట్లు నాకుతున్నారు.. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు.
ఏది ఏమైనా సరే… ఈ నెల 31వ తేదీలోగా గత ఏడాది వానాకాలం సీజన్కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ అధికారులను ఆదేశించారు. రైసు మిల్లర్ల నుంచి బియ్యాన్ని సేకరించి ఎఫ్ సిఐకి అప్పగించడానికి కేవలం 13 రోజుల సమయం మాత్రమే ఉందని ఈ సమయంలో అందరం సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్,…
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధికార ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షుల మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సామాన్య వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తున్నాడని, 76 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. అంతేకాకుండా.. 570…
బుధవారం పాట్నా నుంచి పుణె వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉంది. ఇంతలో తన అమ్మమ్మ చనిపోయిందని పైలట్కు సమాచారం అందింది. అమ్మమ్మ మృతితో మనస్తాపానికి గురైన పైలట్ విమానాన్ని నడపలేదు. దీని తర్వాత విమానయాన సంస్థ ప్రత్యామ్నాయ సిబ్బందిని పిలిచింది. ఈ క్రమంలో విమానం దాదాపు మూడు గంటల తర్వాత ఆలస్యంగా బయలు దేరింది.
రాత్రులు తిరగటం సిగరెట్లు కాలుస్తూ ఊరంతా బలాదూర్గా తిరగటం చేస్తున్న యువత. యువతను సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత సమాజం పని. ఇలాంటి కోవలో హైదరాబాద్ పాతబస్తీ కి చెందిన అయిదుగురు యువకులు అందులో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్ర వాహనాలను దొంగలించటం వాటిని విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేయటం వీరి పని. చాంద్రాయగుట్ట పోలీసులు వాహనాల తనిఖీల సమయంలో అనుమానస్పదంగా ఉన్న మైనర్ బాలుడిన్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. మొత్తం చైన్ బయట పడ్డది.…
ఆదిలాబాద్ జిల్లా బజరహత్నూర్ మండలం చిన్న మియ్యతండా గ్రామ అడవుల్లో గురువారం చిరుతపులి ఆవును చంపింది. చిరుతపులి దాడి చేయడంతో ఓ రైతుకు చెందిన ఆవు అక్కడికక్కడే మృతి చెందింది. అడవిలో పశువులను మేపుతున్న గొర్రెల కాపరులు ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. చిన్న మియ్యతండా, శ్యాంరావుగూడ గ్రామాలకు చెందిన స్థానికులు మాట్లాడుతూ.. చిరుతలు నిర్ణీత వ్యవధిలో పశువులను చంపేస్తున్నాయని, దీంతో రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ముంపు నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు…
లోక్ సభ ఎన్నికల తర్వాత దేశంలో రామరాజ్యమన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇవాళ ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. హిందువులు ఐక్యం కావాలన్నారు. ఈ నెల 22న అందరూ ఇళ్ల ముందు దీపాలు వెలిగించాలని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దేవాలయాలకు రక్షణ అని ఆయన అన్నారు. పసుపు బోర్డు ప్రక్రియ మొదలయ్యిందని, ఈ సీజన్ లో పసుపు ధర 10 వేలకు తగ్గదన్నారు. 20…
ఖమ్మం నుంచి అశ్వరావుపేట మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన బ్రిడ్జి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. దీంతో ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న ముగ్గురు కూలీలు బ్రిడ్జి మించి ఒక్కసారిగా దూకి తమ ప్రాణాలను దక్కించుకున్నారు.