Wheat Stocks: దేశంలో గోధుమల కొరత.. భారీగా తగ్గిన నిల్వలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
FCI: భారతదేశంలో గోధుమల నిల్వలు భారీగా పడిపోయాయి. జనవరి 1 నాటికి దేశవ్యా్ప్తంగా కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో గోధుమల స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఫుడ్ ఏజెన్సీలకు చెందిన గణాంకాలను పరిశీలిస్తే నిల్వలు తగ్గినట్లు తెలుస్తుంది. 2017 తర్వాత ఈ స్థాయిలో గోధుమల నిల్వలు పడిపోవడం ఇదే తొలిసారి. గోధుమల నిల్వల కనీస బఫర్ స్థాయిని 138 లక్షల టన్నులుగా FCI నిర్ణయించింది.
Read Also: Indian Aviation Industry : 2030 నాటికి 30కోట్లమంది ప్రయాణీకులు.. అర్జంట్ గా 2840 విమానాలు అవసరం
Also Read
- Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
- CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
- Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
- Vijay Mallya: ఆర్సీబీ హిస్టారికల్ విన్పై విజయ్ మాల్యా క్రేజీ ట్వీట్.. ఏమన్నారంటే..
అయితే, ప్రస్తుతం బఫర్ స్థాయి కంటే గోధుమల నిల్వలు ఎక్కువగా ఉన్నట్లు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. కానీ, ఉక్రెయిన్- రష్యా, ఇజ్రాయెల్-హమాస్, ఇరాన్- పాకిస్థాన్ దేశాల మధ్య కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితులు పలు దేశాల ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణ లోటుపాట్లు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారత్ లో గోధుమలకు కొరత ఏర్పడితే.. అది తీవ్ర ఆహార సంక్షోభానికి దారి తీయొచ్చని విశ్లేషకులు వార్నింగ్ ఇస్తున్నారు. వెంటనే గోధుమల నిల్వలను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: Gold Price Today : మరోసారి దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
ఇక, గత సంవత్సరం, ప్రపంచంలోని రెండవ అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న భారతదేశం గోధుమల ఎగుమతిని నిలిపివేసింది. ధాన్యం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను అవలంబించింది. గోధుమలు, బాస్మతీయేతర బియ్యం ఎగుమతులను నిషేధించడంతో సహా టోకు వ్యాపారులు, రిటైలర్లు 1,000 టన్నుల కంటే ఎక్కువ గోధుమలను కలిగి ఉండకూడదని తెలిపింది. అయితే, గత ఏడు సంవత్సరాల్లో అత్యధిక నిల్వలు 2021లో నమోదయ్యాయి. మొత్తం గోధుమ నిల్వలు 342.90 లక్షల టన్నులుగా ఉన్నాయి. ఇది 2022లో 330.12 లక్షల టన్నులకు, 2023లో 171.70 లక్షల టన్నులకు తగ్గింది. ప్రస్తుత నిల్వల ప్రకారం స్టాక్ 163.59 లక్షల టన్నులుగా ఉంది.. వెంటనే ధాన్యం సేకరణ చేస్తామని FCI ప్రకటించింది.
తాజావార్తలు
-
Prepaid Electricity System: ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం.. స్మార్ట్ మీటర్లతో అమల్లోకి కొత్త వ్యవస్థ
-
CM Vijay: తిరుచ్చిలో విజయ్ భారీ సభ.. సీఎంగా కాదు.. సేవకుడిగా వచ్చా.. అదే టార్గెట్..!
-
Chasemaster vs Hitman: కోహ్లీ, రోహిత్ కెరీర్లో ఇంతటి వ్యత్యాసమా.. రోహిత్ కెరీర్కు ఎండ్కార్డ్ పడినట్లేనా..?
-
Peddi : ‘పెద్ది’ ఆకలి తీరుస్తుందా?
-
Ram Charan Body Gaurd : రామ్ చరణ్ బాడీ గార్డుకు బాడీ గార్డులు.. ఇది కదా క్రేజ్ అంటే!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!