Republic Day: రిపబ్లిక్ డే వేడుకలకు ప్రత్యేక అతిథులుగా రైతు దంపతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Republic Day Parade: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా 1,500 మంది రైతు దంపతులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వాపం పంపించింది. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ వేడుకలకు రైతు దంపతులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పుకొచ్చారు.
Read Also: Manipur: మణిపూర్ దాడుల్లో మయన్మార్ మిలిటెంట్ల హస్తం..
Also Read
ఇక, దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎంపిక చేసి ఆహ్వానించామని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వాశాఖ అధికారి చెప్పుకొచ్చారు. వ్యవసాయోత్పత్తుల సంఘాల ప్రతినిధులు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, చిన్న తరహా నీటిపారుదల పథకాల లబ్ధిదారులు వీరిలో ఉన్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా వీరికి విందు ఇవ్వనున్నారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలకు దాదాపు 500 మంది రైతులను ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!