Jyotiraditya Scindia : మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్లో ఎన్నో మార్పులు వచ్చాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లా అధికార ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వర్క్ షాప్ కి కేంద్ర మంత్రి జ్యోతి రాదిత్య సింధియా హజరయ్యారు. ఈ సందర్భంగా పలు జిల్లాల బీజేపీ అధ్యక్షుల మార్పులు జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి
జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ.. పదేళ్లలో మోడీ నేతృత్వంలో సివిల్ ఏవియేషన్ లో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. సామాన్య వ్యక్తి విమానాల్లో ప్రయాణిస్తున్నాడని, 76 కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించామన్నారు. అంతేకాకుండా.. 570 రూట్లు అందుబాటులోకి తెచ్చామన్నారు. మారుమూల ప్రాంతాల్లో విమానాశ్రయాల కనెక్టివిటీ పెరిగిందన్నారు. ప్రపంచంలోనే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మార్కెట్
కలిపి ఐదోస్థానంలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. 2030 కల్లా సివిల్ ఏవియేషన్లో మూడో స్థానానికి రావడమే లక్ష్యమన్నారు జ్యోతి రాదిత్య సింధియా. విమానాలు, విమానాశ్రయాలు, ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో 10వేల మంది మహిళలకు డ్రోన్లపై శిక్షణ ఇస్తామని సింధియా చెప్పారు. డ్రోన్లకు 80శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. బోయింగ్, ఎయిర్ బస్ నుంచి ప్రపంచస్థాయి విమానాలను పలు సంస్థలు కొనుగోలు చేస్తున్నాయన్నారు. వింగ్స్ ఇండియా 2024 కార్యక్రమంతో ప్రపంచస్థాయిలో దేశ పౌరవిమానయాన ఘనత చాటి చెప్పొచ్చని ఆయన అన్నారు. 2030 కల్లా 30కోట్ల మందిని విమానయనాన్నికి దగ్గర చెయాలనేది తమ లక్ష్యమని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక ఎయిర్ క్రాఫ్ట్ లను భారత్ కొనుగోలు చేస్తోందని.. మన దగ్గర 57 ఫ్లయింగ్ ట్రెడ్ ఆర్గనైజేషన్ లు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 28 న కరీంనగర్ కి అమిత్ షా రానున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
తాజావార్తలు
-
Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
-
Siddhanth Kapoor: శ్రద్ధా కపూర్ సోదరుడికి ఊరట.. డ్రగ్స్ కేసులో FIR కొట్టేసిన హైకోర్టు!
-
Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
-
Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
-
Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!