వారం వారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది.. అలాగే ఈ వారం ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’, ‘బూట్ కట్ బాలరాజు’ లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.. ఇక ఈ వారం ఓటీటీలో విడుదల అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే విడుదల కానున్నాయి.. ఈ వారం ఏకంగా 21 సినిమాలు విడుదల కాబోతున్నాయి.. మెగాకోడలు లావణ్య త్రిపాఠి నటించిన ‘మిస్ ఫెర్ఫెక్ట్’ సిరీస్ అన్నింట్లో కాస్త ఆసక్తి కలిగిస్తోంది.…
దేశంలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనుండగా.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుంది.
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే సీఎం జగన్ లక్ష్యమని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డి తెలిపారు. శనివారం ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గడియార స్తంభం సెంటరులోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం డ్వాక్రా బజారులో సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను సకాలంలో అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు.
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ, లోక్ సభ ఇంఛార్జుల్లో మార్పులపై కసరత్తు కొనసాగుతుంది. ఇవాళ ఐదవ జాబితా విడుదల చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.
కృష్ణా జిల్లా వైసీపీలో బందరు ఎంపీ సీటు రచ్చ కొనసాగుతుంది. అయితే, బందరు ఎంపీ అభ్యర్థిగా వెళ్ళాలని అవనిగడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను వైసీపీ అధిష్టానం కోరింది. దీనికి అతడు స్పందిస్తూ.. తాను చిన్న వాడిని సరిపోనేమో మరోసారి ఆలోచన చేయాలని వైసీపీ అధిష్టానాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కోరినట్టు సమాచారం.
తొండపిలో ఎవరిమీద దాడి జరిగినా అది మంచి పద్దతి కాదు అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. తొండపి ఘర్షణలను ఖండిస్తున్నా.. నేను దాడి చేయించానని, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నాపై చేస్తున్న కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఎందుకంటే, తొండపి గ్రామం చాలా సున్నితమైన సమస్యాత్మక ప్రాంతం అని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపుతుంది. కాండ్రకోట గ్రామంలోని ఒక ఇంటి ముందు ముగ్గు వేసి పసుపు, కుంకుమ, ఎండు మిర్చిలతో పూజలు చేసిన ఆనవాళ్లు గుర్తించిన స్థానికులు హడలిపోతున్నారు.
ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం.. SBI హోమ్ లోన్స్.. ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల పై భారీగా తగ్గింపును అందిస్తుంది.. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్…
పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల సలార్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. భారీ కలెక్షన్స్ ను కూడా అందుకున్నాడు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. సలార్ పార్ట్ 2, కల్కి 2898 ఏడీ, రాజా సాబ్ వంటి సినిమాలు చేస్తున్నాడు. అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగా, హను రాఘవపూడి వంటి దర్శకులు కూడా ఉన్నారు.. సీతారామం వంటి కల్ట్ క్లాసిక్ సినిమాతో…
అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. నేడు వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని వ్యక్తిగతంగా విచారించనున్నారు.