ప్రతి నెల నెల కొన్ని రూల్స్ మారుతుంటాయి.. అలాగే ఫిబ్రవరి 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబందనలు అమల్లోకి రాబోతున్నాయని తెలుస్తుంది.. కొత్త బడ్జెట్ తో ఫిబ్రవరి నుంచి కొన్ని అంశాల్లో మార్పులూ రానున్నాయి. ఆ మార్పులేంటో తెలుసుకుందాం..
SBI హోమ్ లోన్స్..
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాల పై భారీగా తగ్గింపును అందిస్తుంది.. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోంది. హోమ్ లోన్పై ప్రాసెసింగ్ ఫీజు, రాయితీలకు చివరి తేదీ 31 జనవరి కే ప్రకటించిన విషయం తెలిసిందే.. ఫ్లెక్సిపే, ఎన్ఆర్ఐ, నాన్-లైఫ్, ప్రివిలేజ్, ఇతరులకు ఈ తగ్గింపు ను అందిస్తున్నారు..
NPS విత్ డ్రా రూల్స్..
నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో కూడా పలు మార్పులు చోటు చేసుకొనున్నాయని తెలుస్తుంది.. పాక్షికంగా విత్ డ్రా చేసుకునేందుకు రూల్స్ నిర్దేశిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ జనవరిలో మాస్టర్ సర్క్యులర్ను జారీ చేసింది. మొదటిసారి ఇల్లు కొనేవారు లేదా నిర్మించుకునే వారు మాత్రమే ఈ ఖాతా నుంచి తమ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోగలరని తెలుస్తుంది.. ఈ నిబంధన వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది..
సావరిన్ గోల్డ్ బాండ్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ చివరి విడతను ఫిబ్రవరిలో విడుదల చేస్తుంది. SGB 2023-24 సిరీస్ 4 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది. 16 ఫిబ్రవరి 2024న ముగుస్తుంది. అంతకు ముందు విడత డిసెంబర్ 18న ప్రారంభమై డిసెంబర్ 22న ముగిసింది.. ఇప్పుడు వాయిదాను బంగారం ధరను గ్రాముకు రూ.6,199గా నిర్ణయించింది..
ఇవే కాదు గ్యాస్, పెట్రోల్, కొన్ని ప్రభుత్వ స్కీమ్ లలో కూడా అనేక మార్పులు రానున్నట్లు తెలుస్తుంది..