ఇటీవల సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతులను ఫాలో అవుతూ మోసాలను చేస్తున్నారు. ఆన్ లైన్ లింక్ లను పెడుతూ అకౌంట్ ను ఖాళీ చేస్తున్నారు కొందరు.. అలాగే మరికొందరు మాత్రం ఓటీపీ పేరుతో మోసాలకు పాల్పడుతూ జనాలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టింది.. ఓటీపి మోసాలకు చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నేరగాళ్లు ఓటిపి పొందడానికి స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు…
ఐదేళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనను ప్రజలు ఆదరించి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడు మండలం కాశిపాడు గ్రామంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు
ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్ హీరోగా, ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా వస్తున్న సినిమా లవ్ మీ .ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు .ఈ సినిమాను శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతుందని వార్తలు…
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు.
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం ముసునూరు టోల్ ప్లాజా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి కారు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
వై నాట్ 175 టార్గెట్గా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నేటితో ముగియనుంది. సాయంత్రం అక్కవరం సభ తర్వాత తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. రేపు(ఏప్రిల్ 25) పులివెందులలో నామినేషన్ వేస్తారు. సిద్ధం, మేమంతా సిద్ధం తరహాలోనే.. మరో విడత ప్రచారానికి కూడా వైసీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో ఎవరైనా లబ్ధిపోందారా అని కేటీఆర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారన్నారు. రైతులకు రైతు బంధు రావడం లేదని, దేవుళ్ళు పై ఓట్టు వేసి ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తేనే … బీజేపీ, కాంగ్రెస్ కు భయం ఉంటుందన్నారు. చేవెళ్ల…
జూన్ 4న కమలం వికసించబోతోందన్నారు మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు. ఇవాళ ఎన్టీవీ నిర్వహించిన క్వశ్చన్ అవర్లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీవీ పాత్రికేయులు సంధించిన ప్రశ్నలకు సమాధానంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ను ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 7 నుంచి 14 శాతం వరకు ఓట్లు పెంచుకున్నామన్నారు రఘునందన్ రావు. ఒక సీటు నుంచి 7 అసెంబ్లీ సీట్లకు బీజేపీ…