Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Social Media Monitoring: సోషల్ మీడియా అంశంపై ఏపీ కేబినెట్ ఎజెండా తర్వాత సీరియస్ గా చర్చ జరిగింది.. సోషల్ మీడియాకు సంబంధించి ఒక ప్రత్యేక మెకానిజం రావాలన్నారు సీఎం చంద్రబాబు. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్చ జరిగింది… సోషల్ మీడియాకు సంబంధించి.. పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా… అవసరం అయితే కేంద్రాన్ని కూడా. సంప్రదించి నిర్ణయం. తీసుకోవాలన్నారు సీఎం చంద్రబాబు.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేతలను కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను మాత్రం ఉపేక్షించవద్దని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
సోషల్ మీడియా అంశంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ఇందుకోసం అవసరమైతే బయటనుంచి సిబ్బందిని తీసుకోవాలని పోలీస్ శాఖకు ఆదేశాలు అందాయి.. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు.. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే మాత్రం ఉపేక్షించవద్దని గట్టిగా కోరారు మంత్రులు. ఈ రోజు నుంచే పోలీస్ యంత్రాంగం సోషల్ మీడియాపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని ఆదేశాలు ఇచ్చారు.
Also Read
- CM Chandrababu: రాష్ట్రంలో నీటి కొరతపై అలర్ట్.. ఎల్నినోపై ప్రజలకు సీఎం కీలక సూచనలు
- AP COVID-19 Cases: కరోనా వ్యాప్తిపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కీలక ప్రకటన.. కేరళ టాప్.. ఏపీకి 8వ స్థానం..!
- AP Assembly Panel Speakers: ఏపీ అసెంబ్లీకి కొత్త ప్యానల్ స్పీకర్లు.. ఆరుగురి పేర్లు ప్రకటించిన స్పీకర్
- CM Chandrababu: దమ్ముంటే అసెంబ్లీకి రండి.. వైసీపీకి సీఎం చంద్రబాబు సవాల్.. మెగా డీఎస్సీపై కీలక వ్యాఖ్యలు
ఇప్పటికే సోషల్ మీడియాపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీలో కూడా చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు.. వైసీపీ నేతలు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం పై నుంచి దృష్టి మరల్చేందుకు కొత్త పద్ధతి ఎన్నుకున్నారని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు… వారు కావాలని మన MLAలను రెచ్చగొడుతున్నారన్న సీఎం చంద్రబాబు…. వైసీపీ వాళ్లు రెచ్చగొడితే రెచ్చిపోవద్దని మంత్రులకు సూచించారు… మనలను ట్రాప్ లోకి లాగుతున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు.. అనంతపురం, మిగతా జిల్లాలలో జరిగిన సంఘటనలను ఈ సందర్భంగా ప్రస్తావించారు సీఎం.. అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు చంద్రబాబు.. ఇంఛార్జ్ మంత్రులు జిల్లాలకు వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.. ఇంఛార్జ్ మంత్రులు రెవెన్యూ, ఇతర సమస్యలపై కూడా దృష్టి సారించాలన్నారు.. ఆయా జిల్లాలో ప్రతి అంశంపై ఇంఛార్జ్ మంత్రులు దృష్టి కేంద్రీకరించాలని సూచించారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Dare Devil: అజిత్ ‘డేర్ డెవిల్’ నుంచి తప్పుకున్న మోహన్లాల్.. సెప్టెంబర్ నుంచి షూటింగ్
-
Babar Azam: బాబర్ ఆజంకు బిగ్ షాక్.. పాక్కు కొత్త కెప్టెన్..
-
Premier League: ఆ జట్టుకు బిగ్ షాక్.. లీగ్ నుంచి అవుట్..
-
Off The Record: పరకాల టికెట్ ఆశలు గల్లంతైనట్లేనా..! కొండా ఫ్యామిలీకి సీఎం బిగ్ షాక్?
-
Jharkhand: దిగొచ్చిన హేమంత్ సర్కార్.. విద్యార్థుల డిమాండ్లకు అంగీకారం!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!