Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudha Kongara: సినిమా పరిశ్రమలో పారితోషిక వివాదాలు కొత్త విషయం కాకపోయినా, కొన్నిసార్లు అవి నేరుగా కోర్టు గడప వరకు వెళ్లి సినిమా విడుదలనే ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ మధ్య నెలకొన్న భారీ పారితోషిక వివాదం కూడా ఇప్పుడు అలాంటి చర్చకే దారి తీసింది. ‘పరాశక్తి’ సినిమాకు తనకు రావాల్సిన కోట్ల రూపాయల పారితోషికం ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ సుధా కొంగర కోర్టును ఆశ్రయించగా, మరోవైపు నిర్మాతలు తమ కొత్త చిత్రం ‘ఇదయం మురళి’ విడుదలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇదయం మురళి’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుధా కొంగర కోరిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే థియేటర్లలో విడుదల కానుంది. అయితే పారితోషిక బకాయిలపై దాఖలైన ప్రధాన పిటిషన్ విచారణ మాత్రం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
- Mahendragiri Varahi: మహేంద్రగిరి వారాహి రివ్యూ..
సుధా కొంగర పిటిషన్ ప్రకారం, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమాకు గాను జీఎస్టీతో కలిపి మొత్తం రూ.17.70 కోట్ల పారితోషికం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే అందాయని, ఇంకా రూ.8.39 కోట్లు బకాయిగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఒప్పందం ప్రకారం పూర్తి పారితోషికం చెల్లించకుండానే అదే నిర్మాణ సంస్థ మరో సినిమాను విడుదల చేయడం సరికాదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు గత కొన్ని వారాలుగా తమిళ సినీ పరిశ్రమలో ప్రధాన చర్చగా మారింది. ఈ వ్యవహారంలో ముందుగా మద్రాస్ హైకోర్టు ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల లావాదేవీలపై తాత్కాలికంగా నిలిపేయమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాతలు, దర్శకురాలి మధ్య రాజీ కుదురుతుందేమో అన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా విచారణలో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. చెల్లింపు వివాదం ఉన్నప్పటికీ, దానిని ఆధారంగా చేసుకుని ‘ఇదయం మురళి’ థియేట్రికల్ విడుదలను ఈ దశలో అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘పరాశక్తి’ ఇప్పటికే విడుదలకు ముందు, తర్వాత కూడా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించిన పారితోషిక వివాదం మరోసారి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ‘ఇదయం మురళి’ విడుదలకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకి లేకపోయినా, సుధా కొంగరకు చెల్లించాల్సిన బకాయి పారితోషికంపై న్యాయపోరాటం మాత్రం ఇంకా ముగియలేదు. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో, తుది తీర్పు ఏ విధంగా వస్తుందన్న ఆసక్తి సినీ పరిశ్రమలో నెలకొంది. నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మధ్య ఆర్థిక ఒప్పందాలకు సంబంధించిన అంశాల్లో ఈ కేసు భవిష్యత్తులో ఒక కీలక ఉదాహరణగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- cinema
- Sudha Kongara
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్వాచ్లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?