Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudha Kongara: సినిమా పరిశ్రమలో పారితోషిక వివాదాలు కొత్త విషయం కాకపోయినా, కొన్నిసార్లు అవి నేరుగా కోర్టు గడప వరకు వెళ్లి సినిమా విడుదలనే ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ మధ్య నెలకొన్న భారీ పారితోషిక వివాదం కూడా ఇప్పుడు అలాంటి చర్చకే దారి తీసింది. ‘పరాశక్తి’ సినిమాకు తనకు రావాల్సిన కోట్ల రూపాయల పారితోషికం ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ సుధా కొంగర కోర్టును ఆశ్రయించగా, మరోవైపు నిర్మాతలు తమ కొత్త చిత్రం ‘ఇదయం మురళి’ విడుదలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇదయం మురళి’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుధా కొంగర కోరిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే థియేటర్లలో విడుదల కానుంది. అయితే పారితోషిక బకాయిలపై దాఖలైన ప్రధాన పిటిషన్ విచారణ మాత్రం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Tollywood: వరుస గాయాలతో రెస్ట్ మోడ్ లోకి టాలీవుడ్ హీరోలు!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్పై కీరవాణి కీలక నిర్ణయం!
సుధా కొంగర పిటిషన్ ప్రకారం, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమాకు గాను జీఎస్టీతో కలిపి మొత్తం రూ.17.70 కోట్ల పారితోషికం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే అందాయని, ఇంకా రూ.8.39 కోట్లు బకాయిగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఒప్పందం ప్రకారం పూర్తి పారితోషికం చెల్లించకుండానే అదే నిర్మాణ సంస్థ మరో సినిమాను విడుదల చేయడం సరికాదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు గత కొన్ని వారాలుగా తమిళ సినీ పరిశ్రమలో ప్రధాన చర్చగా మారింది. ఈ వ్యవహారంలో ముందుగా మద్రాస్ హైకోర్టు ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల లావాదేవీలపై తాత్కాలికంగా నిలిపేయమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాతలు, దర్శకురాలి మధ్య రాజీ కుదురుతుందేమో అన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా విచారణలో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. చెల్లింపు వివాదం ఉన్నప్పటికీ, దానిని ఆధారంగా చేసుకుని ‘ఇదయం మురళి’ థియేట్రికల్ విడుదలను ఈ దశలో అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘పరాశక్తి’ ఇప్పటికే విడుదలకు ముందు, తర్వాత కూడా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించిన పారితోషిక వివాదం మరోసారి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ‘ఇదయం మురళి’ విడుదలకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకి లేకపోయినా, సుధా కొంగరకు చెల్లించాల్సిన బకాయి పారితోషికంపై న్యాయపోరాటం మాత్రం ఇంకా ముగియలేదు. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో, తుది తీర్పు ఏ విధంగా వస్తుందన్న ఆసక్తి సినీ పరిశ్రమలో నెలకొంది. నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మధ్య ఆర్థిక ఒప్పందాలకు సంబంధించిన అంశాల్లో ఈ కేసు భవిష్యత్తులో ఒక కీలక ఉదాహరణగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- cinema
- Sudha Kongara
తాజావార్తలు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
-
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!