Sudha Kongara: రూ.8.39 కోట్ల పారితోషిక వివాదం.. సుధా కొంగరకు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sudha Kongara: సినిమా పరిశ్రమలో పారితోషిక వివాదాలు కొత్త విషయం కాకపోయినా, కొన్నిసార్లు అవి నేరుగా కోర్టు గడప వరకు వెళ్లి సినిమా విడుదలనే ప్రభావితం చేసే పరిస్థితులు కూడా ఏర్పడతాయి. ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర, ప్రముఖ నిర్మాణ సంస్థ డాన్ పిక్చర్స్ మధ్య నెలకొన్న భారీ పారితోషిక వివాదం కూడా ఇప్పుడు అలాంటి చర్చకే దారి తీసింది. ‘పరాశక్తి’ సినిమాకు తనకు రావాల్సిన కోట్ల రూపాయల పారితోషికం ఇంకా చెల్లించలేదని ఆరోపిస్తూ సుధా కొంగర కోర్టును ఆశ్రయించగా, మరోవైపు నిర్మాతలు తమ కొత్త చిత్రం ‘ఇదయం మురళి’ విడుదలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఇదయం మురళి’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ సుధా కొంగర కోరిన మధ్యంతర ఉత్తర్వులను కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ చిత్రం ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే థియేటర్లలో విడుదల కానుంది. అయితే పారితోషిక బకాయిలపై దాఖలైన ప్రధాన పిటిషన్ విచారణ మాత్రం కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది.
Also Read
- Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
- Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
- Young Heroines: హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమే కాదు.. తల్లి పాత్రలతో కొత్త రూట్లో యంగ్ హీరోయిన్లు! అసలు లెక్క ఇదే..
- Mallepoola Pallaki Song: ‘ఇరుముడి’ నుంచి ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. సినిమాపై అంచనాలు పెంచేసిన రవితేజ!
సుధా కొంగర పిటిషన్ ప్రకారం, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కిన ‘పరాశక్తి’ సినిమాకు గాను జీఎస్టీతో కలిపి మొత్తం రూ.17.70 కోట్ల పారితోషికం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే అందులో ఇప్పటివరకు కేవలం రూ.9.31 కోట్లు మాత్రమే అందాయని, ఇంకా రూ.8.39 కోట్లు బకాయిగా ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఒప్పందం ప్రకారం పూర్తి పారితోషికం చెల్లించకుండానే అదే నిర్మాణ సంస్థ మరో సినిమాను విడుదల చేయడం సరికాదని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ కేసు గత కొన్ని వారాలుగా తమిళ సినీ పరిశ్రమలో ప్రధాన చర్చగా మారింది. ఈ వ్యవహారంలో ముందుగా మద్రాస్ హైకోర్టు ‘పరాశక్తి’ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ హక్కుల లావాదేవీలపై తాత్కాలికంగా నిలిపేయమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నిర్మాతలు, దర్శకురాలి మధ్య రాజీ కుదురుతుందేమో అన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా విచారణలో కోర్టు మరోసారి స్పష్టత ఇచ్చింది. చెల్లింపు వివాదం ఉన్నప్పటికీ, దానిని ఆధారంగా చేసుకుని ‘ఇదయం మురళి’ థియేట్రికల్ విడుదలను ఈ దశలో అడ్డుకోవడం సాధ్యం కాదని పేర్కొంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా, సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ‘పరాశక్తి’ ఇప్పటికే విడుదలకు ముందు, తర్వాత కూడా పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు అదే చిత్రానికి సంబంధించిన పారితోషిక వివాదం మరోసారి పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ‘ఇదయం మురళి’ విడుదలకు ఎలాంటి న్యాయపరమైన అడ్డంకి లేకపోయినా, సుధా కొంగరకు చెల్లించాల్సిన బకాయి పారితోషికంపై న్యాయపోరాటం మాత్రం ఇంకా ముగియలేదు. ఈ కేసుపై మద్రాస్ హైకోర్టులో విచారణ కొనసాగనున్న నేపథ్యంలో, తుది తీర్పు ఏ విధంగా వస్తుందన్న ఆసక్తి సినీ పరిశ్రమలో నెలకొంది. నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మధ్య ఆర్థిక ఒప్పందాలకు సంబంధించిన అంశాల్లో ఈ కేసు భవిష్యత్తులో ఒక కీలక ఉదాహరణగా మారే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
- Tags
- cinema
- Sudha Kongara
తాజావార్తలు
-
Shiva Nirvana: ‘ఇరుముడి’ క్లైమాక్స్పై శివ నిర్వాణ క్రేజీ హింట్.. ఆ 40 నిమిషాలు మర్చిపోలేరట!
-
Irumudi Pre-Release: ఇరుముడి ఈవెంట్లో రవితేజ.. నక్షత్రపై షాకింగ్ కామెంట్స్.!
-
Medico Suicide: ఉప్పల్లో విషాదం.. మెడికో బలవన్మరణం.!
-
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Success Story: రూ.37 వేల జీతంతో మొదలైన ప్రయాణం..11 ఏళ్లలో రూ.2.2 కోట్లకు.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?